Currency Notes : ఈ మధ్య మార్కెట్లో 2 వేల రూపాయల నోటు పెద్దగా కనిపించటం లేదు.. ఎందుకో తెలుసా.. ఆ నోటు ముద్రణనను రెండు సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఆపేసింది.. రెండు వేల రూపాయల కొత్త నోటు గురించి లోక్ సభ లో కేంద్రం కీలక ప్రకటన చేసింది.. గత రెండు సంవత్సరాలుగా 2 వేల రూపాయల నోట్ల ముద్రణ జరగలేదని ఆర్ధిక శాఖ అధికారి అనురాగ్ ఠాకూర్ సోమవారం పార్లమెంటుకు తెలిపారు. సోమవారం లోక్ సభ లో ఒక లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఏప్రిల్ 2019 నుంచి ఇప్పటి వరకు 2 వేల రూపాయల నోట్లు ముద్రించలేదని తెలిపారు.. ప్రజల ఆర్ధిక లావాదేవీల డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని rbi తో సంప్రదించి నోట్ల ముద్రణ పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. భారత దేశంలో 2016 లో 2000 నోటు ముద్రణ ప్రారంభమైంది. నోట్ల రద్దుతో 1000, 500 నోట్లను ఉపసంహరించిన తరవాత కేంద్రం 2000 నోటును తీసుకువచ్చింది.. అయితే 2000 నోటును రద్దు చేయలేదని, కేవలం ప్రింటింగ్ మాత్రమే నిలిపివేసినట్లు క్లారిటీ ఇచ్చింది. 2000 నోటు చలామణిలో ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.. ప్రజలకు దీనిపై ఎలాంటి సందేహాలు పెటుకోవద్దని rbi వివరణ ఇచ్చింది. సర్క్యూలేషన్ లో ఉన్న నోట్లు మాత్రమే చలామణిలో ఉంటాయని.. కొత్తగా 2000 నోట్లను ముద్రించమని.. కేంద్ర ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది..