ఏపిలో భారీ ఎత్తున బంగారం స్మగ్లింగ్ జరుగుతోందన్న సమాచారంతో కస్టమ్స్ అధికారులు ఈ రోజు విస్తృతంగా తనిఖీలు జరిపారు. ఒక్క రోజే రూ.11 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. విజయవాడ, ఏలూరు, సూళ్లూరుపేట, కాకినాడ, చిలకలూరిపేట, నెల్లూరు ప్రాంతాల్లో బస్సులు, రైళ్లలో కస్టమ్స్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. వంద మంది అధికారులు 20 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు.
Munugode Bypoll: రోడ్ రోలర్ గుర్తు వివాదం .. ఆర్ఒ పై వేటు
అక్రమంగా తరలిస్తున్న బంగారం, నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 13,189 కిలోల బంగారంతో పాటు రూ.4.24 కోట్ల నగదును అధికారులు పట్టుకున్నారు. చెన్నై నుండి సూళ్లూరుపేట వస్తున్న ఓ వ్యక్తి నుండి అత్యధికంగా అయిదు కిలోల బంగారాన్ని అధికారుుల స్వాధీనం చేసుకున్నారు.
Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?