పెట్రోల్ బంకుల్లో ఘరానా మోసాలు మరోసారి బయటపడ్డాయి. మీటర్ కరెక్ట్ గా వచ్చి, పెట్రోల్ మాత్రం తక్కువ వచ్చేలా పెట్రోల్ బంకుల్లో ఒక చిప్ ద్వారా అవకతవకలకు పెట్రోల్ బంక్ యాజమాన్యాలు పాల్పడుతున్నాయి. ఇటువంటి అవకతవకలను గుర్తించిన ఎస్వోటీ పోలీసులు సైబరాబాద్ పరిధిలోని పలు బంకులపై దాడి చేసి అవకతవకలను గుర్తించి వాటిని సీజ్ చేసారు.
ఒక్క హైదరాబాద్ పరిధిలోనే ఇటువంటి మోసాలకు పాల్పడుతున్న 13 బంకులను సీజ్ చేసారు. అలాగే మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇటువంటి మోసాలు భారీ ఎత్తున జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి 26 బంకులని సీజ్ చేశారు ఎస్వోటీ పోలీసులు. ఇటువంటి ప్రత్యేక చిప్ లను బంకు యజమానులు మహారాష్ట్ర నుండి తెప్పించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీని ద్వారా కొన్ని కోట్ల రూపాయల మోసం జరిగినట్లు ప్రాధమిక విచారణలో తేలింది.