బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను మాండూస్ గత అర్ధరాత్రి తర్వాత పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ఉదయమే బలహీనపడిన తుఫాను ఇవేళ ఉదయం మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. మధ్యాహ్నానికి మరింత బలహీనపడుతుందని పేర్కొంది. తుఫాను ప్రభావంతో ఏపి, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే తీరం వెంబటి గంటకు 65 నుండి 75 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి.
కోస్తా, రాయలసీమల్లోని పలు చోట్ల వర్షాలు కురిసాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిత్తూరు జిల్లాలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులను తరలించారు. తిరుపతి, చిత్తూరు నగరాల్లో భారీ వర్షాల కారణంగా రహదారులు జలమయమైయ్యాయి. తుఫాను ప్రభావంతో తమిళనాడులోని కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురంతో పాటు పుదుఛ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్,ాలు, మరో 26 జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసాయి.
దక్షిణ, ఉత్తర కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో ఇవేళ ఉరుములు, మెరుపుల తో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చెన్నై నుండి నడవాల్సిన 27 విమానాలను నిన్న రద్దు చేశారు. ఏపి, తమిళనాడులో తుఫాను ప్రభావిత జిల్లా ల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
YS Sharmila: వైఎస్ షర్మిల భీషణ ప్రతిజ్ఞ..