అమరావతి:బంగాళాగాతంలో అతితీవ్ర తుపాన్గా ఫోనీ మారిందని ఆర్ టి జి ఎస్ తెలియజేసింది.
*మచిలీపట్నంకు ఆగ్నేయంగా 360 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో ఫోని కేంద్రీకృతమైనదని పేర్కొంది.
*శ్రీకాకుళంఉత్తర మరియు తీరప్రాంత మండలాలలో రెడ్ అలెర్ట్ కొనసాగుతోంది. గంటకు 120కిలో మీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి.
*ఉత్తర శ్రీకాకుళం, తీరప్రాంత శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రెండు, మూడు తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు పేర్కొంది.
*విశాఖపట్నం మరియు తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు
*తీవ్ర ప్రభావమున్న మండలాలు. .
శ్రీకాకుళం: గార, ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, సంతబొమ్మాళి, పలాస, పొలాకి, నందిగం, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం.
*విజయనగరం:భోగాపురం, చీపురుపల్లి, డెంకాడ, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, పూసపాటిరేగ.
*ఈ మండలాల్లోని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
*తుపాన్ తీరం దాటడానికి ముందు ఎవరూ బయటకు రాకూడదని హెచ్చరిస్తున్నారు.
*సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలనీ, వాహనాలపైన బయట సంచరించకూడదని ప్రజలకు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సూచిస్తోంది.