అమరావతి: ఫొని తుఫాను ఉత్తరాంధ్రను వణికిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా పయనిస్తున్న ఫోని మరి కొద్ది గంటల్లో ఒదిషా సమీపిస్తుందని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) శుక్రవారం ఉదయం తెలిపింది.శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇచ్చాపురానికి తూర్పున 60 కిలో మీటర్ల దూరంలో తుఫాన్ పయనిస్తున్నట్లు తెలియజేశారు.
ఈ ప్రభావంతో అక్కడ పెనుగాలులు వీస్తున్నాయి.
గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలనీ, ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ఆర్ టి జి ఎస్ హెచ్చరిస్తోంది.
ఒడిశావైపు గంటకు 11 కిలో మీటర్ల వేగంతో ఫొని కదులుతున్న తెలియజేసింది.
ఈ రోజు ఉదయం 10.30 నుంచి 11.30 గంటల మధ్య ఒడిశా రాష్ట్రం పూరీకి దక్షిణ దిశగా తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఇంకా ప్రచండ తుపాన్గానే ఫొని పయనిస్తున్నట్లు తెలియజేసింది.