(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అరేబియా సముద్రంలో ఒకే సారి రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి అరేబియా సముద్రంలో హిందూ మహా సముద్రం దిశగా భూమధ్యరేఖ వద్ద ఒక అల్పపీడనం, ఈశాన్య అరేబియా సముద్రంలో లక్షదీవుల వద్ద మరో అల్ప పీడనం ఏర్పడ్డాయని తెలిపింది. ఈ రెండూ 24 గంటల్లో వాయుగుండాలుగా మారుతాయని వాతావరణ శాఖ భావిస్తున్నది. వీటి ప్రభావంతో సోమవారం రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్ర రాయలసీమలకు చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.