కరోనా లాక్ డౌన్ ను ఆసరాగా చేసుకొని ఎన్నో చోట్ల ఎన్నో రకాల స్మగ్లింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కేరళలో ఇటువంటి ఒక స్మగ్లింగ్ లో ఏకంగా ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అన్న వార్తలు కూడా మొన్నామధ్య వచ్చాయి. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు లో అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు.
వందే భారత్ మిషన్ విమానాల్లో వస్తున్న ప్రయాణికుల్లో కొంతమంది అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారు. దామన్ నుండి వస్తున్న 11 మంది ప్రయాణికులు అంతా బంగారం స్మగ్లర్లు కావడం గమనార్హం. లోదుస్తుల్లో పెట్టుకుని మరీ ఆ పదకొండు మంది బంగారం తీసుకొస్తున్న వైనం ఇప్పుడు ఎయిర్ పోర్టు అధికారులను విస్మయపరిచింది. ఈ విషయమై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.