Dance+ : డ్యాన్స్ ప్లస్ Dance+ షో గురించి బుల్లి తెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డ్యాన్స్ ప్లస్ షో ఇటీవలే ప్రారంభం అయినా.. ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పటి వరకు వచ్చిన డ్యాన్స్ షోలు ఒక ఎత్తు. ఈ షో ఇంకో ఎత్తు. ఈ షోకు అంత పాపులారిటీ ఉంది.
అయితే.. ఎలిమినేషన్స్ దగ్గర పడుతున్నా కొద్దీ.. ఈ షో ఇంకా ఆసక్తిగా మారుతోంది. చాలా టఫ్ గా మారుతోంది. అదే ప్రేక్షకులకు కూడా నచ్చుతోంది. ఎక్కడైనా కంటెస్టెంట్ల మధ్య గొడవలు ఉండటం చూశాం కానీ.. ఎలిమినేషన్ ప్రక్రియలో జడ్జిలు గొడవ పడటం ఇప్పుడే చూశాం.
డ్యాన్స్ ప్లస్ షోలో మూడో ఎలిమినేషన్ లో జడ్జిలు ముమైత్ ఖాన్, యష్ మాస్టర్ మధ్య గొడవ వచ్చింది. సాంకేత్ విషయంలో వీళ్ల మధ్య గొడవ వచ్చింది. సాంకేత్ అనే కంటెస్టెంట్ బాగానే పర్ ఫాం చేసినా.. కావాలని ముమైత్ ఖాన్, రఘు మాస్టర్, బాబా భాస్కర్.. ఇంకా మిగితా జడ్జిలు కూడా ఎలిమినేషన్ కోసం సాంకేత్ ను నామినేట్ చేశారు. దీంతో యష్ మాస్టర్ దానికి అభ్యంతరం చెప్పారు. డ్యాన్స్ బాగా చేస్తే.. స్ట్రాంగ్ గా ఉంటే అతడిని ఎలిమినేట్ చేయడానికి నామినేట్ చేస్తారా? అంటూ యష్ మాస్టర్ ప్రశ్నించాడు.
Dance+ : జడ్జిల జడ్జిమెంట్ నే తప్పుపడతారా?
అయితే.. జడ్జిల జడ్జిమెంట్ నే తప్పు పడుతున్నారంటూ యష్ మాస్టర్ పై మిగితా జడ్జిలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముమైత్ ఖాన్ అయితే.. ఇలా నా జడ్జిమెంట్ ను తప్పుపడితే నేను ఉండను.. అంటూ ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. అసలు.. ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం ఈ శనివారం దాకా ఆగాల్సిందే.
దానికి సంబంధించిన ప్రోమో మాత్రం విడుదలైంది. మీరు కూడా దానిపై ఓ లుక్కేసుకోండి.