కేంద్రపడ, జనవరి 7: ఒదిషా రాష్టంలోని కేంద్రపడ జిల్లా డెరాస్ సమీపంలో ఆదివారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు డ్యాన్సర్లు మృతి చెందారు. మిడ్నైట్ డ్యాన్స్ ప్రొగ్రామ్ నిర్వహించి తిరిగి వెళుతుండగా కేంద్రపడ జిల్లా డెరాస్ వద్ద వీరి కారును ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. మృతులు కేంద్రపడకు చెందిన రాయల డ్యాన్స్ గ్రూపు సభ్యులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.
previous post