Mamatha Baneerjee : త్వరలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కి ఊహించని షాక్ లు సొంత పార్టీ నుండి ఎదురవుతున్నాయి.
మేటర్ లోకి వెళ్తే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు బిజెపి పార్టీ లోకి వెళ్లి పోవడంతో మమతా పై ప్రజలలో వ్యతిరేకత ఉంది అనే భావన తీసుకురావడానికి కమలం పార్టీకి చెందిన నాయకులు తెగ ఊవిళ్లురుతున్నారు. మరోపక్క మమతా పార్టీ నాయకులను కట్టడి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం పనిచేయడం లేదు. ఇదే క్రమంలో ప్రశాంత్ కిషోర్ ఇలాంటి వ్యూహకర్తలు భారతీయ జనతా పార్టీ ఏ మాత్రం గెలిచే ఛాన్స్ లేదు అని బల్లగుద్ది చెబుతున్న తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుండి నాయకులు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోవడం.. ఆ పార్టీ గ్రాఫ్ రోజురోజుకీ తగ్గుతున్నట్లు ప్రజలలో సందేహాలు నెలకొంటున్నాయి. ఇటీవలే ఒక ఎమ్మెల్యే రాజీనామా చేయగా తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ అటెండ్ కావాలని పార్టీ అధిష్టానం విప్ జారీ చేస్తే ఒక ఎమ్మెల్యే రాజీనామా చేయగా దాదాపు 60 మందికి పైగా ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో బెంగాల్లో మమతా బెనర్జీ కి డేంజర్ బెల్స్ మొగ్గుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మమతా మరియు ఆమె మేనల్లుడు ఆడుతున్న రాజకీయ డ్రామాలకు సొంత పార్టీలోనే వ్యతిరేకత స్టార్ట్ అయినట్లు బెంగాల్ రాజకీయాలో టాక్ వినిపిస్తోంది.