వర్షాకాలం మొదలైతే సీజనల్ వచ్చే జ్వారాలు ఎక్కువవుతాయి. ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ కూడా ఎక్కవగా వస్తుంది. ప్రస్తుత కరోనా సమయంలో ఈ డెంగ్యూ మరింత ప్రమాదకరం అవుతుందని పరిశోధకులు అంటున్నారు. కరోనా, డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఒకేలా ఉండటం డాక్టర్లకు సవాల్ గా మారనున్నాయని అంటున్నారు. వీటిని గుర్తించడంలో చాలా కష్టం. దీంతో డెంగ్యూ వస్తే కరోనా అని భావించే అవకాశం ఉంది. డెంగ్యూ వచ్చిన వారికి కరోనా సోకితే పరిస్థితి మరింత జటిలమవుతుందని కూడా హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుత సీజన్లో కోవిడ్ – డెంగ్యూతో బాధపడే రోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రెండు పరిక్షలు చేయాల్సిన అవసరం ఉంది. ఒకదాని వల్ల మరొక మరింత ముదిరే అవకాశం ఉంది. కరోనా సోకిన వారికి డెంగ్యూ సోకినా.. డెంగ్యూ సోకిన వారికి కరోనా సోకినా పరిస్థితి తీవ్రత మరింత పెరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 9లక్షలు దాటిపోయింది. మరణాల సంఖ్య 23వేలు దాటిపోయింది.
డెంగ్యూ కేసులను పరిశీలిస్తే 2016 నుంచి ఏటా లక్ష కేసుల పైనే నమోదవుతున్నాయి. 2019లో 1,36,422 కేసులు నమోదైతే 132 మంది చనిపోయారు. దక్షిణాదిలో వర్షాలు, ఉత్తరాదిలో చలి ఎక్కువ కావడంతో డెంగ్యూ ప్రభావానికి కారణమని కూడా పరిశోధకులు అంటున్నారు. తలనొప్పి, ఒళ్లు నొపపులు, జ్వరం.. డెంగ్యూ లక్షణాలని అంటున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో డెంగ్యూ మరింత ప్రమాదకరమని అంటున్నారు. ఎవరైనా మూడు రోజులపాటు జ్వరంతో బాధపడితే వారికి డెంగ్యూతోపాటు కరోనా టెస్టు కూడా చేయించాలని అంటున్నారు.