Dasara special : దసరా నవరాత్రులను ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అమ్మవారికి ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో అలంకరణ చేసి వివిధ రకాల నైవేద్యాలను పెట్టి అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. ఈరోజు దసరా ఉత్సవాల్లో అమ్మవారు మహిషాసూర మర్థిని రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. అలాగే ఈరోజు అమ్మవారికి బెల్లం అన్నంతో తయారుచేసిన ప్రసాదంను నైవేద్యంగా పెడతారు
బెల్లం అన్నం తయారు చేయుటకు కావలసినవి పదార్ధాలు :-
బియ్యం -100 గ్రాములు
బెల్లం- 150 గ్రాములు
యాలకులు -5
నెయ్యి -50 గ్రాములు
జీడిపప్పు -10
కిస్ మిస్ -20
బెల్లం అన్నం చేసే విధానం :-
ముందుగా బియ్యంను కడిగి ఒక అరగంట పాటు నాన బెట్టుకుని పక్కన పెట్టుకోవాలి.ఆ తరువాత స్టవ్ వెలిగించి అన్నంను మెత్తగా ఉడికించుకోవాలి. అన్నం మెత్తగా ఉడికిన తరువాత అందులో తరిగిన బెల్లం వేసి మొత్తం కరిగెంత వరకు ఉడికించాలి.బెల్లం కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి అన్నం దించేయాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టి అందులో కాస్త నెయ్యి వేసి జీడిపప్పులు, కిస్ మిస్ వేసి దోరగా వేయించాలి. తరువాత జీడిపప్పులు,యాలకుల పొడిని మొత్తం అన్నంలో వేసి కలిపి దించేయాలి. అంతే తియ్యని కమ్మని బెల్లం అన్నం రెడీ అయినట్లే..ఈ ప్రసాదంను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి కొని అమ్మ కృపకు పాత్రులవుదాము.