Coconut rice : దేవీ నవరాత్రులలో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టంమైన ప్రసాదములను తయారు చేసి అమ్మవారి. కృపకు పాత్రులు కాగలరు. రేపు అమ్మావారి అమ్మవారు అన్నపూర్ణా దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు కావున అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కొబ్బెరన్నం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..!
కావలసిన పదార్ధాలు :
బియ్యం- 1/2 కిలో
తురిమిన పచ్చికొబ్బెర -1 కప్
పచ్చిమిర్చి – 5
కరివేపాకు – కొద్దిగా
కోత్తమిర – కొద్దిగా
ఉప్పు -తగినంత
పోపు పదార్ధాలు -2 టేబుల్ స్పూన్స్
ఎండుమిర్చి -5
ఇంగువ- చిటికెడు
జీడి పప్పు- 10
నూనె -1/4 కప్
నెయ్యి 1 టెబుల్ స్పూన్
తయారు చేయు విధానం:
ముందుగా అన్నం పోడి పోడిగా వండుకొని చల్లార్చుకోవాలి. తరువాత పచ్చికొబ్బెరిని తురూముకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టి అందులో కాస్త నేయి వేసి జీడిపప్పులను వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత తురుముకున్న కొబ్బరిని వేసి వేయించాలి.. ఇప్పుడు వేయించిన కొబ్బరిని అన్నంలో కలపాలి.అలాగే కొబ్బరితో పాటుగా సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి.తరువాత అదే మూకుడులో నూనె వేసి పోపు సామాగ్రి అంతా వేపాలి.అవి వేగిన తరువాత ఎండుమిర్చి , ఇంగువ , పొడవుగా తరిగిన పచ్చిమిరప కాయలు , కరివేపాకు వేయాలి. అన్ని చక్కగ వేగిన తర్వాత తాలింపును అన్నంలో బాగా కలపాలి.. తరువాత జీడిపప్పు,కోత్తిమీర వేసి తిప్పాలి అంతే కమ్మటి, రుచికరమైన కొబ్బెరన్నం రెడి అయినట్లే.