హైదరాబాద్, మార్చి 6 : డేటా వివాదం కేసు దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తొమ్మిది మందితో కూడిన ఈ దర్యాప్తు బృందానికి ఐజి స్టీఫెన్ రవీంద్ర నేతృత్వం వహించనున్నారు.
కామారెడ్డి ఎస్పి శ్వేత, సైబరాబాద్ క్రైమ్ డిసిపి రోహిణి ప్రియదర్శిని, నారాయణపేట డిఎస్పి శ్రీధర్, సైబర్ క్రైమ్ డిఎస్పి రవి కుమార్ రెడ్డి, మాదాపూర్ ఏసిపి శ్యాం ప్రసాద్ రావు, ఇన్స్పెక్టర్ రమేశ్, వెంకటరాంరెడ్డిలను సిట్లో సభ్యులుగా నియమించింది.