టీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ కార్గో సర్వీస్ సెంటర్ లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కార్గో సిబ్బంది తమ వద్దకు వచ్చిన అన్ని పార్శిళ్ల వివరాలను ఒక్కొక్కటిగా నమోదు చేసుకుంటూ ఉండగా ఇంతలో ఓ పార్శిల్ నుంచి తీవ్ర దుర్వాసర వచ్చింది. అది భరించలేకపోయిన సిబ్బంది వెంటనే ఆ పార్సెల్ ను పక్కకు తీశారు. అసలు ఇంతటి దుర్వాసన రావడానికి ఆ పార్సెల్ లో ఏముందోనని తెరిచి చేశారు. అంతే ఆ పార్సెల్ లో కనిపించింది చూసి కేకలుపెట్టారు. ఆ పార్శిల్ లో ఓ మృత పిండం వారికి కనిపించింది. అది చుసిన వారు షాక్ లో ఉండిపోయారు.
రివర్ అనే డయాగ్నస్టిక్ సెంటర్ నల్లగొండ జిల్లా లోని ప్రభుత్వ ఆస్పత్రికి ఎదురుగా ఉంది. అయితే, ఓ మృతపిండాన్ని నిర్వాహకులు హైదరాబాద్ లోని ఒక ల్యాబ్ కు పంపించాలిసి ఉంది. ఇలాంటి చెయ్యాలిసినప్పుడు వాస్తవానికి ఏదైనా ప్రత్యేక వాహనం లో కానీ అంబులెన్స్ ద్వారా కానీ తరలించాలి. కానీ ఆ డయాగ్నస్టిక్స్ నిర్వాహకులు ఆలా చెయ్యలేదు. ఆర్టీసీ బస్సుల ద్వారా కార్గో సర్వీసులను నిర్వహిస్తారన్న విషయం విదితమే. ఇంకేముంది, ఆ కార్గో సర్వీసుల ద్వారా వారు ఆ మృత పిండాన్ని ల్యాబ్ కి పంపించాలనుకున్నారు.
వారు ఆ మృతపిండాన్ని ఓ పార్శిల్ గా కట్టి, ఆ పార్శిల్ ను ఓ సిమెంట్ బస్తాలో కట్టి ఎంజీబీఎస్ కేంద్రానికి పంపించారు. ఆ కార్గో సర్వీసు సిబ్బందికి దాంట్లో ఏముందో తెలియక ఆ పార్శిల్ ను తీసుకెళ్లారు.
ఆ పార్సెల్ హైదరాబాద్ కు చేరుకునేసరికి ఆ మృతపిండం నుంచి భరించలేని దుర్వాసన రావడంతో అసలు విషయం బటయటకు వచ్చింది. ఈ విషయమై టీఎస్ ఆర్టీసీ సిబ్బంది డయాగ్నస్టిక్స్ నిర్వాహకులను ప్రశ్నించగా, అందులో తప్పు ఏముంది అని ఎదురు ప్రశ్నించడం గమనార్హం.