ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు డెబిట్, క్రెడిట్ కార్డులు కలిగి ఉండటం షారా మాములే.. చాలా మంది క్యాష్ లెస్ లావాదేవిలు జరుపుతున్నారు. షాపింగ్ మాల్స్, పెట్రోలు బంకు, ఆన్ లైన్ షాపింగ్ ఇలా…ప్రతి దానికి వారి కలిగి ఉన్న క్రెడిట్, డెబిట్ కార్డ్ లు ఉపయోగిస్తున్నారు. అయితే నేటి నండి ఈ కార్డులు ఎటియం సెంటర్లలో పని చేయవా.. అంటే అవును అని చెప్పాలి. కంగారు పడాల్సిన విషయం అయితే కాదు. మీ దగ్గర ఉన్న కార్డులు మొరాయిస్తే హైరానా పడకండి అని బ్యాంక్ సంబంధిత అధికారులు తెలుపుతున్నారు.
డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించి ఇంటర్నేషనల్ ఆన్ లైన్ కాంటక్ట్ ట్రన్స్క్షన్ లెస్ సర్వీసులు నిలిచిపోనున్నాయని తెలుస్తుంది. వీటిని తిరిగి పునరుద్దరించడానికి సమీపంలో సంబంధిత బ్యాంకులో సంప్రదించాలి. లేదా బ్యాంకు కు సంబంధించిన యాప్ లో రిక్వెస్ట్ నమోదు చేయాలి. అలా చేసిన 24 గంటల వ్యవధిలో సేవలు పునరుద్దరించబడతాయి అని సంబంధిత అధికారులు వివరించారు.
బ్యాంకులు కస్టమర్స్ కు డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నారు. ఈ కార్డులు ఉపయోగించే వారికి ప్రత్యేక రాయితీలు కూడా వస్తాయి. పలానా బ్యాంకు కు సంబంధించిన క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు జరిగితే ఐదు శాతం, పది శాతం రాయితీలు ఇస్తామని ప్రకటనలు గుప్పస్తుంటారు. ఇలా క్యాష్ లెస్ ట్రాన్సక్షన్ లకు చాలా మంది ఆకర్షితులౌతున్నారు. అలానే కరోనా వైరస్ వలన ఎక్కువ మంది ఆన్ లైన్ షాపింగ్ లకు పరిమితమైనారు. క్యాష్ లెస్ లావాదేవిలకు అలవాటు పడిన ఈ తరుణంలో క్రెడిట్, డెబిట్ కార్డులు గంట సమయం పని చేయక పోయిన ఆందోళన చెందకుంటా ఎలా ఉంటారు…