ఇండియా లో దీపిక పదుకొనేకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఆమె పారితోషికానికి, స్టైల్ కి సరితూగేవారు బాలీవుడ్ లో చాలా తక్కువ మందే ఉన్నారు. ఇండియాలో సోషల్ మీడియా లో అందరికంటే ఆమెకే హైయ్యస్ట్ ఫాలోయర్స్ ఉన్నారు.
ఈమెకు ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా 52 మిలియన్స్ ఫాలోయర్స్ ఉన్నారు. ఒక్క పోస్ట్ దీపిక నుంచి వచ్చిందంటే చాలు అదో సంచలనం అనే చెప్పాలి. ఆమె పోస్టులు నిమిషాల్లో దెబ్బకు వైరల్ అయిపోతాయి. దీపికా కు అంత పాపులారిటీ ఉంది. అలాంటి దీపిక పదుకొనే ఉన్నట్లుండి తన ఇంస్టాగ్రామ్ మరియు ట్విట్టర్ లలో తన పోస్టులు అన్నీ డిలీట్ చేసింది. దాంతో ఆమె అభిమానులంతా షాక్ అయిపోయారు.
ఆమె అకౌంట్ హ్యాక్ అయిందా అంటూ ఆమె అభిమానులు ఆరా తీయడం మొదలు పెట్టారు. దీపిక పదుకొనే కూడా దీనిపై ఏమి స్పందించలేదు. ఆమె న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఫోటోలు చూద్దాం అనుకున్న అభిమానులకు ఆమె నిరాశనే మిగిల్చింది. ఇలాంటి సమయంలో మరోసారి ఈమె సోషల్ మీడియా కు గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా మై ఆడియో డైరీ అంటూ కొత్త పోస్ట్ ను షేర్ చేసింది దీపిక పదుకొనే. ఇందులో దీపిక వాయిస్ ఉండడంతో ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగ్ వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా దీపిక ఇకపై కూడా ఇలాంటి పోస్టులు పెడతానని చెప్పింది. 2021 మొదట్లోనే దీపిక నుంచి పోస్ట్ రావడంతో పండగ చేసుకుంటున్నారు అభిమానులు. ఈ వాయిస్ మెసేజ్ చూసి ఆమె అభిమానులు దీపిక ఈజ్ బ్యాక్ అంటూ పండగ చేసుకుంటున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!