రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన 20వ సినిమా రాధే శ్యామ్ గా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్న సమయంలో కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేకులు పడింది. అయితే ప్రభాస్21 సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తుండగా అశ్విని దత్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ ను రేపు ఉదయం 11న రివీల్ చేయనున్నారు. అయితే ఆ అప్డేట్ ఏమై ఉంటుందా అని ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తుండగా మాకు అందిన సమాచారం ప్రకారం రేపు ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకోన్ పేరుని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు మరిన్ని భారతీయ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.