shanmukh jaswanth: బుల్లితెరలో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ షో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ హౌస్ లోకి వచ్చాక చాలామంది పాపులర్ కూడా అయ్యారు. ఈ క్రమంలోనే దీప్తి,షన్ముఖ్ జస్వంత్ కూడా బాగా ఫేమస్ అయిపోయారు. బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యాక షన్నుతో పాటు దీప్తి సునైనా పేరు కూడా మారు మొగిపోతుంది. వీరిద్దరూ బిగ్ బాస్ లోకి రాకముందు నుంచే వీరు ప్రేమలో ఉన్నారు. బిగ్ బాస్’ తర్వాత వీరిద్దరి ప్రేమ గురించి బయట ప్రపంచానికి తెలిసింది. యూట్యూబ్ వీడియోలతో పాపులరైన ఈ జంటకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రెజ్ ఉంది.షన్ను, దీప్తి కలిసి కొన్ని కవర్ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్లో కూడా ఆడిపాడాడు.
దీప్తి, షన్నుల ప్రేమకు గుర్తుగా మిగిలిన టాటూ..:
అలా వారిద్దరూ ప్రేమలో పడి ఆ ప్రేమకు గుర్తుగా వారి చేతిపై లవ్ సింబల్ టాటూస్ కూడా వేయించుకున్నారు. కానీ షన్ను ఎప్పుడయితే ‘బిగ్ బాస్’ హౌస్ లోకి వెళ్ళాడో అప్పుడే సీన్ అంతా మారిపోయింది.బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ అయిన సిరి..షన్నుకు దగ్గరయి హగ్ ల వర్షం కురిపించేసింది. అయితే వాళ్ళకి అది ఫ్రెండ్లి హాగ్ అయ్యి ఉండొచ్చు కానీ అది బ్యాడ్లక్ ‘హగ్’ అని తరువాత షన్నుకు తెలిసింది.ఒకవిధంగా చెప్పాలంటే సిరితో రిలేషన్ వల్ల అతడు ‘బిగ్ బాస్’ టైటిల్ మాత్రమే కాకుండా తన ఐదేళ్ల ‘ప్రేమ’ను కూడా కోల్పోయాడనే చెప్పాలి. అసలు వీళ్ళ తొలి పరిచయం ఎప్పుడు.. ఎలా జరిగింది.. అసలు వారి బ్రేకప్కు కారణం ఏమిటీ?
అసలు వారి బ్రేక్ అప్ కి కారణం ఏంటంటే?
షన్ముఖ్ జస్వంత్ విశాఖపట్నంలో పుట్టాడు. అక్కడే గీతమ్ యూనివర్శిటీలో చదివాడు.హాస్య నటుడు వైవా హర్షాకు షన్ముఖ్ బంధువు అవుతాడు.వీరిద్దరు కలిసి కొన్ని యూట్యూబ్ వీడియోలు కూడా చేశారు. ఆ తర్వాత షన్ను కొన్ని షార్ట్, కామెడీ వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యారు. ఇకపోతే హైదరాబాద్కు చెందిన దీప్తి సునయన రెడ్డి ‘డబ్ స్మాష్’ వీడియాలతో పాపులర్ అయింది.దీప్తి సునయన డబ్స్మాష్ వీడియోలు చూసి ఫిదా అయ్యి 2016లోనే ఆమెను కలిశాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి డబ్ స్మాష్లు చేశారు. 2017 సంవత్సరంలో షన్ను యూట్యూబ్ సీరిస్కు మంచి ఆధరణ లభించింది. మరోవైపు దీప్తి సునయన కవర్ సాంగ్స్తో పాపులారిటీ సంపాదించింది. చివరికి
తనీష్ తో నిజంగానే దీప్తి లవ్ లో ఉందా..?
2018లో ‘బిగ్ బాస్-2’లో ఛాన్స్ కొట్టేసింది దీప్తి.బిగ్ బాస్ సీజన్-2లో నటుడు, హౌస్మేట్ తనీష్తో చనువుగా ఉండడం చూసి తనీష్ను ప్రేమిస్తోందనే ప్రచారం జరిగింది. కానీ, షన్ను-దీప్తిల ప్రేమ అప్పటికి కొనసాగింది. ఆ తరువాత 2021లో ప్రసారమైన ‘బిగ్ బాస్’ సీజన్-5లో షన్ను ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తనకు అప్పటికే పరిచయం ఉన్న సిరితో చనువుగా ఉన్నాడు. సిరి కూడా అతడికి హగ్లు ఇస్తూ.. సీజన్ మొత్తం అతడితోనే ఉంది.వీరిని చూసి జనాలతో పాటు దీప్తి కూడా బాగా హర్ట్ అయినట్లు ఉంది.అంతే షన్ను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దీప్తి అతడిని కలవలేదు.
మళ్ళీ షన్ను, దీప్తి కలుస్తారా..?
పైగా వారిద్దరు ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసుకున్నారు. ఇద్దరు ‘బ్రేకప్’ అయ్యారని భావించారు. కానీ బ్రేక్ అప్ గురించి ఇద్దరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ 2021, డిసెంబరు 31న బ్రేకప్ తీసుకుంటున్నట్లు దీప్తి ప్రకటించింది జనవరి 1, 2022న షన్ను ఆమె నిర్ణయాన్ని స్వాగతించాడు.పాపం.. ఐదేళ్ల ప్రేమ చివరికి ఇలా ముగుస్తుందని ఎవరు ఊహించలేదు. వారి అభిమానులు కూడా వాళ్ళు విడిపోతున్నారు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.మరి రాబోయే రోజుల్లో వారి మధ్య అపార్ధాలు అన్ని తొలగిపోయి ఒక్కటవ్వుతారో లేదో వేచి చూడాలి.