Deepti Sunaina: వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-5 (Bigg boss telugu 5)లో షణ్ముఖ్ జస్వంత్, సిరి హనుమంత్ బీభత్సమైన స్క్రీన్ స్పేస్ దక్కించుకున్నారు. ఈ సీజన్ లో మొదటి కొన్ని వారాలు తప్ప మిగతా వారాల్లో వీరిద్దరి చుట్టే బిగ్బాస్ సీజన్ కొనసాగింది. అందుకు కారణం లేకపోలేదు. వీరిద్దరూ ఆట గాలికొదిలేసి రొమాన్స్ చేసుకున్నారు. లవర్స్ కంటే ఎక్కువ రెచ్చిపోయి సిరి, షణ్ముఖ్ కెమెరా ముందే హద్దులు మీరారు. తెలుగులో ఇప్పటివరకు వీళ్లలాగా ఏ కంటెస్టెంట్లు రొమాన్స్ చేసుకోలేదంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి రొమాన్స్ బుల్లితెర ప్రజలకు చాలా కొత్త కాబట్టి ఇప్పటికీ వాళ్లని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. దీప్తి సునైనా బ్రేకప్ చెప్పడంతో ట్రోల్స్ కు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ నేపథ్యంలో దీప్తితో విడిపోయి సిరితో కలుస్తావా అని ఓ రిపోర్టర్లు షన్నుని ప్రశ్నించాడు. దీనికి ఒక ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పాడు షన్ను.
Deepti Sunaina: షన్ను చెప్పిన ఇంట్రెస్టింగ్ సమాధానమిదే
ఒక రిపోర్టర్ ఈ ప్రశ్న సంధించగా షణ్ముఖ్ ఒక్కసారిగా షాకయ్యారు. దీప్తి తో విడిపోవడం ఏంటి.. సిరి తో కలవడం ఏంటి? అని అవాక్కయినట్లు ఆయన ఫేస్ పెట్టాడు. బిగ్బాస్ హౌజులో తమ ఫ్రెండ్ షిప్ ను చాలా మంది తప్పుగా అర్థం చేసుకొని నెగిటివ్ ఆలోచనలతో ట్రోల్ చేస్తున్నారని షన్ను చెప్పుకొచ్చాడు. నిజానికి సిరి తనకు ఒక మంచి ఫ్రెండ్ అని.. తాను, సిరి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామని.. ఈ చనువుతో ఆమెను ప్రొటెక్ట్ చేయాలనే ఆలోచనతో కాస్త ఎక్కువగా కేర్ తీసుకున్నానని వివరించాడు. దయచేసి సిరిని ఎవరూ కూడా ట్రోల్ చేయొద్దని షణ్ముఖ్ తన అభిమానులతో పాటు మిగతా అందరికీ విజ్ఞప్తి చేశాడు. సిరికి, తనకు మధ్య స్నేహబంధం తప్ప మిగతా ఏ రిలేషన్ లేదని.. హౌజులో తాము ఏవిధంగా ఉన్నామో బయటకు వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ఉన్నామని స్పష్టం చేసాడు.
Deepti Sunaina: ఈ ప్రశ్న అడగడానికి అదే కారణమా
హౌస్ నుంచి బయటకు వచ్చాక దీప్తి మొహం చాటేయడంతో షణ్ముఖ్ బాధపడుతున్నాడని.. అతన్ని సిరి ఓదారుస్తుందని.. వీరిద్దరూ ప్రస్తుతం కలిసే ఉంటున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో వాస్తవం లేదని చెబుతున్నాడు షణ్ముఖ్. తాను ఇప్పుడు సింగిల్ అని స్పష్టం చేస్తున్నాడు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?