complaint: మనం బయట కొనుక్కనే కొన్ని కొన్ని వస్తువులు పదార్ధాలు విడిగా అమ్మడానికి వీలు ఉండదు. తప్పనిసరిగా వాటిని ప్యాకెట్ లో పెట్టి అమ్మాల్సిందే. ఉదాహరణకు ద్రవరూపంలో ఉన్న పదార్ధాలు ప్యాక్ చేసి మాత్రమే విక్రయించడానికి కుదురుతుంది.. ఇలా ప్యాకింగ్ లో మాత్రమే దొరికే పదార్ధాలు చాలానే ఉన్నాయి. అయితే ప్యాకెట్ల లో ఉంచిన పదార్థాలు ఏమిటో దాని స్వరూప స్వభావాలు ఎలా ఉన్నాయో వినియోగదారులకు తెలియాల్సి ఉంది. వినియోగదారుడు మోసపోకుండా ప్రభుత్వం ప్యాకేజబుల్ కమోడిటీస్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఉత్పత్తిదారులు లేదా ప్యాక్ చేసిన వారు తప్పనిసరిగా ప్యాక్ పై ఈ క్రింది సమాచారాన్ని కచ్చితం గా ముద్రించవలసి ఉంటుంది. అలా చేయకపోతే వారు శిక్షార్హులు గా ఉంటారు.
1. ప్యాకెట్ లో ఉంచబడిన వస్తువు యొక్క వర్ణన.
2. ప్యాక్ చేయబడిన తేదీ కి సంబందించిన వివరాలు
3. ప్యాక్ చేసిన నాడు ఆ పదార్ధము యొక్క కచ్చితమైన బరువు
4. ప్యాక్ చేసిన వారి చిరునామా లేదా ఉత్పత్తి చేస్తున్న వారికి సంబంధించిన పూర్తి చిరునామా
5. ఆ వస్తువు యొక్క గరిష్ట చిల్లర ధర
6. ఆహారపదార్ధాలను ఎంత కాలం లో వాడుకోవాలి.. అన్నది తప్పకుండా తెలియజేయాలి
మెడిసిన్స్ లో అయితే తయారీ తేదీతో పాటు ఎక్స్పైరీ తేదీ కూడా కచ్చితంగా ఇవ్వాలి.ఇలా ప్యాక్ పై ముద్రించిన సమాచారానికి అనుగుణంగా ఆ వస్తువు లేకపోయినా లేదా ప్యాక్ పై ముద్రించిన ధర కంటే ఎక్కువ ధరకు అమ్మితే చిల్లర వ్యాపారుల పై జరిమానా విధిస్తారు.ఈ విషయాలపై లీగల్ మెట్రాలజీ శాఖ కు అధికారం కల్పించారు. లీగల్ మెట్రాలజీ అంటే కొలతలు,తూనికలు శాఖ అని అర్ధం. ముఖ్యంగా చిల్లర వ్యాపారులు శిక్షలకు గురికావడం జరుగుతుంది.
ఉత్పత్తిదారులు/ప్యాక్ చేసిన వారు స్థానికంగా వుండరు కనుక చిల్లర వ్యాపారులను కూడా ఈ కేసులో ఇరికించడం అనేది జరుగుతుంది. ఈ వివరాల్ని సరిగ్గా ముద్రిచండంలో ఉత్పత్తిదారుని/ప్యాక్ చేసిన వారి నిర్లక్ష్యమే అని కోర్టు నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే చిల్లర వ్యాపారి కేసు నుంచి బయటపడగలుగుతారు . కాబట్టి ఈ విషయంలో చిల్లర వ్యాపారులు జాగ్రత్తగా ఉండటం మంచిది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?