NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Rahul Gandhi: ‘దేశానికి ఆయన ఆలోచనలు అవసరం’.. రాహుల్ గాంధీకి యావదాస్తి రాసి ఇచ్చిన డెహ్రాడూన్ వృద్ధురాలు

Rahul Gandhi: స్వాతంత్రోద్యమ కాలంలో దేశ వ్యాప్తంగా చాలా మంది తమ స్థిర చరాస్తులను జాతీయ కాంగ్రెస్ పార్టీకి రాసి ఇచ్చారు. ఆ తరువాత కాలంలో వారసులు లేని చాలా మంది తమ ఆస్తులను దేవాలయాలకు, అన్నదాన సత్రాలకు దానంగా ఇవ్వడం చూశాం. కానీ ప్రస్తుత రోజుల్లో ఓ 78 ఏళ్ల వృద్ధురాలు తన యావదాస్తిని ఓ జాతీయ పార్టీ నేత పేరుతో వీలు రాయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ కి చెందిన వృద్దురాలు తన చరాస్తినంతా ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పేరిట రాసి ఇచ్చింది. డెహ్రాడూన్ లోని నెహ్రూ కాలనీకి చెందిన పుష్ప ముంజియాల్ అనే వృద్ధురాలు ప్రస్తుతం ఓ వృద్ధాశ్రమంలో ఉంటోంది. ఆమెకు వారసులు ఎవరు లేరు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై అభిమానంతో తనకు ఉన్న రూ.అరకోటికిపైగా ఆస్తికి రాహుల్ రాహుల్ ను నామినీగా పేర్కొంటూ వీలునామా రాయించి స్థానిక కోర్టులో సమర్పించింది. వీటికి సంబంధించిన పత్రాలను ఉత్తరాఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రీతమ్ సింగ్ కు సోమవారం అందజేస్తూ, తను ఈ పని ఎందుకు చేశారో వివరించారు.

Dehradun old women transfers al her property to Rahul Gandhi
Dehradun old women transfers al her property to Rahul Gandhi

Rahul Gandhi: రాహుల్ ఆలోచనలు ప్రభావితం చేశాయి

నిరాడంబరత, నిజాయితీ, నిష్కలంకతత్వం ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ అని పేర్కొన్న ఆమె రాజకీయ ప్రత్యర్ధులు ఆయనను అనవసరంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆయనను వేధించడం తనకు భాద కల్గించిందనీ, ఆందుకే ఆయనకు మద్దతు గా నిలవాలనుకున్నానని పేర్కొన్నారు. రాహుల్ ఆలోచనలు దేశానికి అవసరమని, ఆయన ఆలోచనలు తనను ప్రభావితం చేశాయనీ, అందుకే తన ఆస్తిని ఆయనకు ఇస్తున్నానని చెప్పారు. తొలుత తన ఆస్తిని రాహుల్ గాంధీ భార్యకు ఇవ్వాలని భావించాననీ, కానీ ఆయనకింకా వివాహం కాకపోవడంతో రాహుల్ పేరిటే వీలునామా రాసినట్లు వెల్లడించారు. బ్యాంకుల్లో ఉన్న 50 లక్షల ఫిక్డ్స్ డిపాజిట్ లకు రాహుల్ గాంధీ పేరును నామినీగా రాసిన ఆమె తన వద్ద ఉన్న పది తులాల బంగారు ఆభరణాలను మరణానంతరం రాహుల్ గాంధీకి చెందేలా వీలు రాశారు.

 

అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసును గెలవలేకపోయింది. ప్రజాకర్షక పథకాలను పార్టీ మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చవిచూసింది. అయినప్పటికీ ఆ రాష్ట్రానికి చెందిన ఓ వృద్ధురాలి మనసును రాహుల్ గాంధీ గెలుచుకున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ అభిమానులు స్పందిస్తున్నారు. రాహుల్ అభిమానులు ఆ వృద్ధురాలి చర్యను మెచ్చుకుంటున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju