దేశ రాజధాని రాష్ట్రమైన ఢిల్లీలో లో కరోనా వైరస్ వ్యాపిస్తున్న తీరును గమనిస్తూనే ఉన్నాం. గత 24 గంటల్లో దేశంలో నమోదు మరణాల్లో ఒక్క ఢిల్లీ నుంచే 25 శాతం మరణాలు సంభవించడం గమనార్హం. అయితే ఇప్పుడు ఢిల్లీ వైద్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ నేడు కరుణ వైరస్ నిర్థారణ పరీక్షలో పాజిటివ్ అని తేలడం ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది.
55 ఏళ్లు వయసు ఉన్న సత్యేందర్ గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఉండగా అతనికి శ్వాస తీసుకోవడంలో కూడా సమస్యలు తలెత్తాయి. ప్రస్తుతం రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్యేందర్ జైన్ కోలుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలతో పాటు దేశ ప్రజలందరూ విపరీతంగా ఆకాంక్షిస్తున్నారు. అతని వయస్సు ఎక్కువ కావడాంతో పరిస్థితి విషమమయ్యే అవకాశాలు ఎక్కువ అని వైద్యులు తెలిపినట్లు సమాచారం.
ఇకపోతే ఏకంగా దేశ రాజధాని రాష్ట్రం యొక్క వైద్య శాఖ మంత్రి కే కరోనా నుండి రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు.