NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Delhi High Court: ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు! ముఖ్యమంత్రులు ఇక మూతులు కట్టుకోవాల్సిందే!!

Delhi High Court: మైక్ దొరికితే చాలు ఎడాపెడా హామీలు ఇచ్చేసే ముఖ్యమంత్రులకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది.ముఖ్యమంత్రులు ఇష్టం వచ్చినట్లు ఎడాపెడా హామీలిచ్చి వాటిని గాలికి వదిలేయడం ఇక కుదిరే పని కాదు.ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని కోర్టు ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.నిజానికి ఇది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు సంబంధించిన కేసులో వెలువడిన తీర్పు కావచ్చు.కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ తీర్పు ప్రభావం కనిపించే అవకాశం లేకపోలేదు.

Delhi High Court verdict sensational!
Delhi High Court verdict sensational

కేజ్రీవాల్ కేసేమిటంటే?

కరోనా కష్టకాలంలో ఇంటి అద్దె కట్టలేని వలస కార్మికుల అద్దె బకాయిలను తాము చెల్లిస్తామని గత ఏడాది మార్చిలో మొదటి లాక్డౌన్ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. కిరాయి చెల్లించలేనివారు చెల్లించనక్కర్లేదని, ఇంటి యజమానులు కూడా కిరాయి కోసం బలవంతం చేయవద్దని ఆ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని ఆయన మార్చి ఇరవై తొమ్మిదిన ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించిన మీడియా సమావేశంలోనే ఒక స్పష్టమైన పత్రికా ప్రకటన చేశారు అయితే ముఖ్యమంత్రి ఈ హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు దీనిపై సీఎం ఆధీనంలోనే ఉండే రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోకపోవడాన్ని కిరాయిదారులు, ఇంటి యజమానులు ఒక పిటిషన్ ద్వారా హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా సింగ్ సంచలన తీర్పు ఇచ్చారు.

తీర్పు సారాంశం ఏమిటంటే!

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన ఆ హామీపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని న్యాయమూర్తి తీవ్రంగా తప్పుబట్టారు. సీఎం ఇచ్చిన హామీ, వాగ్దానం లేదా చేసిన ప్రకటన స్పష్టంగా అమలుచేయదగ్గ వాగ్దానం అవుతుందని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి ఒకసారి హామీ ఇచ్చాక దానిని అమలు చేయాలా వద్దా అనే విధాన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని పేర్కొన్నారు.ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండటం చట్ట వ్యతిరేకం అవుతుందని కూడా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాధినేతలు తమ పౌరులకు బాధ్యతాయుతమైన హామీలు ఇవ్వాలని,అవి అమలయ్యేలా చూడాలని న్యాయమూర్తి చెప్పారు.ముఖ్యమంత్రి ఆర్థికపరమైన పర్యవసనాలు అన్నీ తెలిసే హామీలు ఇస్తారని,ఇప్పుడు ఏవేవో సాకులు చూపి ఆ హామీ అమలు నుండి తప్పుకోవటం కుదరదన్నారు.కిరాయిదారుల అద్దెల చెల్లింపు విషయంలో ఆరువారాల్లోగా ప్రభుత్వ విధాన నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తి ప్రతిభా సింగ్ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించారు.

పౌరుల చేతికో ఆయుధం!

ఈ కేసు తీర్పులోనే జస్టిస్ ప్రతిభా సింగ్ పౌరులకు కూడా ఒక పదునైన ఆయుధాన్ని అందించారు.ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏ సందర్భంలోనైనా సరే ఇచ్చే హామీల అమలుకు ప్రజలు పట్టుబట్టవచ్చని,కోర్టు తలుపులు తట్టవచ్చని ఆయన తెలిపారు.ఇలాంటి హామీలపై విధాన నిర్ణయం ప్రకటించకుండా నాన్చడం కుదరదని, ప్రజలు కోర్టులకు వెళ్లవచ్చునని న్యాయమూర్తి వివరించారు.

 

author avatar
Yandamuri

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju