Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియాకు ఉచ్చు బిగుస్తొంది సీబీఐ. ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియా సన్నిహితుడైన ప్రముఖ వ్యాపారి దినేశ్ అరోరాని సీబీఐ అధికారులు విచారణ జరపగా ఆయన అప్రూవర్ గా మారారు. దీంతో దినేశ్ అరోరాను సాక్షిగా పరిగణించాలని కోరుతూ కోర్టులో సీబీఆ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో దినేశ్ అప్రూవర్ గా మారారనీ, ఆయన తెలిపే కీలక విషయాలు కేసు పరిష్కారానికి కీలకం కానున్నాయని సీబీఐ పిటిషన్ లో పేర్కొంది. కోర్టు ఈ వేళ దీనిపై విచారణ జరపనుంది.
Bypoll Results: ఆ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ‘నోటా’నే సెకండ్ ప్లేస్ .. ఎక్కడంటే..?
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఓ పక్క సీబీఐ, మరో పక్క ఈడీ దర్యాప్తు జరుపుతోంది. దేశ వ్యాప్తంగా విసృత సోదాలు జరిపింది. పలువురు వ్యక్తులను ఇప్పటికే అరెస్టు చేశారు. వారి ద్వారా వచ్చిన సమాచారంతో పలు పర్యాయాలు దాడులు నిర్వహించి కీలక పత్రాలు, బ్యాంకు లావాదేవీలు సేకరించారు అధికారులు. మనీశ్ సిసోడియాకు సన్నిహితుడైన దినేశ్ అరోరా బ్యాంకు ఖాతాలోకి యూకో బ్యాంకు ద్వారా సమీర్ మహేంద్రు కోటి రూపాయలు ట్రాన్స్ ఫర్ చేసినట్లుగా ఈడీ విచారణలో తేలింది. ఆ నగదు తర్వాత సిసోడియాకు చేరిందని సీబీఐ ఆరోపిస్తుంది. కోట్ల రూపాయల మేర నగదు బదిలీ చేసిన అర్జున్ పాండే, విజయ్ నాయర్, రామచంద్ర పిళ్లే, అభిషేక్ బోయినపల్లి మీద కూడా ఈడీ కేసులు నమోదు చేసింది.
Breaking: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు