ప్రపంచ వ్యాప్తంగా కరోనా నివారణా చర్యలను కఠినంగా అమలవుతున్నాయి. కాగా ప్రజలకు కరోనా వైరస్ నియంత్రణపై డాక్టర్లు, వైద్యులు, ప్రభుత్వాలు పలు సూచనలు చేస్తూనే ఉన్నారు. అయినా కరోనా మాత్రం నిను విడిచి నేనుండలేనంటూ జనాలకు అంటుకుంటూనే ఉంది. కాగా ప్రపంచ దేశాలన్నీ కరోనా నియంత్రించడం కోసం అనేక చర్యలను తీసుకుంటూనే ఉన్నాయి. అలాగే టీకా కోసం పరిశోధనలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు మేం టీకా తయారు చేశామంటూ అధికారికంగా ప్రకటించాయి. అయితే వచ్చే ఏడాదిలో టీకాను బయటకు తెస్తామంటూ పలు సంస్థలు హామీనిస్తున్నాయి.
కాగా అప్పటి వరకు ప్రజలు మరింత కేర్ ఫుల్ గా ఉండాలంటూ ప్రభుత్వాలు ప్రజలకు సూచనలను చేస్తున్నాయి. అయితే కరోనా వైరస్ ఎక్కడ మాకు సోకుతుందన్న ముందున్న భయం ఇప్పుడు ఏ మాత్రం కనిపించడం లేదు. మూతికి మాస్కులు లేకుండా, సోషల్ డిస్టెన్స్ అస్సలే పాటించకుండా జనాలు విచ్చల విడిగా తిరిగేస్తున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు కొంత మేరకు తగ్గుముఖం పట్టినా దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కరోనా వైరస్ విజృంబన రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వైరస్ వ్యాపిస్తుండటంతో అక్కడి ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది.
అందుకోసం కఠిన నిర్ణయాలను కూడా తీసుకోబోతోంది. అయితే బుధవారం ఒక్క రోజే దేశ రాజధానిలో 7,400 కు పైగా పాజిటీవ్ కేసులు వచ్చాయి. అలాగే 131 మరణాలు ఆ ఒక్క రోజే జరిగాయి. ఇప్పటి వరకు ఢిల్లీలో కరోనా కేసులు 5 లక్షలు దాటింది. 7,943 మంది ఇప్పటి వరకు కరోనాతో ప్రాణాలు విడిచారు. అందుకే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరోనా నియంత్రణ కోసం గురువారం అఖిల పక్షం సమావేశం నిర్వహించారు. అనంతరం ఈయన మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి జనాలు పండగలకు, ఫంక్షన్లకు దూరంగా ఉండాలని సూచించారు.
అలాగే వచ్చే ఛట్ పూజను కూడా ఇంటి వద్దే ఉండి ఎలాంటి ఆడంబరాలకు పోకుండా జరుపుకోవాలని తెలిపారు. మరీ ముఖ్యంగా నదులు, వాగుల వద్ద భారీగా జనాలు గుమికూడొద్దని ఆంక్షలు జారీ చేశారు. అలాగే 200 మంది కలిసి ఒకే చోట కూడి వేడుకలు చేసుకోకూడదని ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు. దీనితో పాటుగా మరీ ముఖ్యంగా కరోనా నిబంధనలను ఉల్లింగించి మాస్కులు ధరించకుండా బయటకు తిరిగితే వారికి రూ.2 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.