(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పుత్రరత్నం జాగ్వార్ కారు అడిగాడు. తల్లిదండ్రులు బిఎమ్డబ్ల్యు కారు కొనిచ్చారు. ఒక కారు అడిగితే ఒక కారు కొనిస్తారా. ఎంత అన్యాయం. అతనిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ కొనిచ్చిన బిఎమ్డబ్ల్యు కారు తీసుకుని బయటకు వెళ్లాడు. చక్కా వెళ్లి తళతళా మెరిసిపోతున్న కొత్త కారును నదిలో తోశాడు. ఈ సంఘటన హర్యానా రాష్ట్రంలోని యమునా నగర్లో జరిగిందని ఐఎఎన్ఎస్ వార్తా సంస్థ తెలిపింది.
ఆ యువకుడు కారును నదిలోకి తోస్తూ వీడియో కూడా తీశాడు. వెంటనే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కొద్ది సేపటి తర్వాత ఆగ్రహం తగ్గి వివేకం వెన్ను తట్టింది. స్థానికంగా ఉండే ఈతగాళ్లను పిలిచి కారు బయటకు తెచ్చే పని ప్రారంభించాడు. అయితే కారు లోపల నీటి మొక్కలలో చిక్కుకుపోయింది. ఈ లోపు పోలీసులు రంగప్రవేశం చేసి యువకుడిపై కేసు పెట్టారు.
https://www.facebook.com/oneindiatelugu/videos/1240854292762036/