ఉపవాసము అంటే ఆహారము తీసుకొనే విధానం లో నియంత్రణను పాటీంచడమే ఇందులో ఉండే ముఖ్య ఉద్దేశం. ఉపవాసముద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఉపవాసములు చేసే పద్దతులలో నెలలో రెండు సారులు ఏకాదశి రోజున చేసే ఉపవాసము తో శరీరానికి మంచి ఆరోగ్యం కలుగుతుంది.
ఏకాదశి రోజున ఉపవాసం ఎలా చేయాలి? అనేది తెలుసుకుందాం!!
ఏకాదశి రోజున తెల్లవారు ఝామున 4 నుండి 5 గంటల మధ్యన నిద్రలేచి కాల కృత్యములు, వ్యాయములు, స్నానము వంటి నిత్య కృత్యములు పూర్తిచేసి పూజ చేసుకోవాలి.సహజంగా ఏకాదశి ఉపవాసం అంటే ఆ రోజు అంతా ఏమి తినకుండా తాగకుండా ఉంటారు.తర్వాతి రోజు అంటే ద్వాదశి నాడు సూర్యోదయానికి ముందే భోజనం చేసేయటాన్ని పారణం అంటారు. ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు వెళ్ళాకముందే భోజనము (పారణం)చేయాలి.
ఒకవేళ ఏకాదశినాడు పూర్తిగా ఉపవాసం ఉండలేనివాళ్ళు పాలు, పండ్లు, పెరుగు, సగ్గుబియ్యం,మజ్జిగ తీసుకోవచ్చు. ధాన్యాలు కాని, పప్పుదినుసులు కానీ ఆ రోజు అస్సలు తినవద్దని పురాణాలు చెప్తున్నాయి.ఎనిమిదేళ్ల పిల్లలు, 80 ఏళ్ళు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, షుగర్, బీపీ వంటి వ్యాధులు ఉన్నవారు, శ్రామికులు, రైతులు , ఉద్యోగానికి తప్పక వెళ్లాల్సినవారు ఉపవాసాన్ని ఆచరించక పోయిన దోషం లేదు అని పురాణాలుచెబుతున్నాయి .
ఈ ఉపవాసం వలన శరీరానికి మంచి వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. అయితే, పది గంటల పాటు ఉపవాసం చేయదలచిన వారు ఉదయాన్నే 6 గంటలకు 2 గ్లాసుల గోరు వెచ్చటి నీరుతాగి, మళ్ళీ సాయంత్రము నాలుగు గంటల తర్వాత 2 గ్లాసుల గోరువెచ్చటి నీటిని తాగాలి .
ఒక పూట ఉపవాసం మాత్రం ఉందాము అనుకున్నవారు సాయంత్రము 6 గంటలకు సాత్వికమైన ఆహారం మితం గా తీసుకోవాలి. రాత్రి 10 గంటలలోపునే నిద్రపోవాలి. ఈ ఉపవాసాన్ని ఆచరించడం వలన పుణ్యం ఆరోగ్యం రెండు పొందవచ్చు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?