Lake of skeletons: మన దేశంలో హిమాలయాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎవరికైన భారతదేశం అనగానే ముందుగా గుర్తు వచ్చేది హిమాలయాలు మరియు ఆచారాలు. అయితే హిమాలయాలలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ‘త్రిశూల్’ పర్వతం భారతదేశంలోనే ఎత్తైన పర్వతాల్లో ఒకటి. ఈ పర్వతం ఏటవాలుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పర్వతం క్రింద ‘రూపకుండ్’ అనే సరస్సు ఉంది. ఈ సరస్సుకి ఉన్న మరో పేరే అస్థిపంజరాలు సరస్సు. ఈ సరసుకి సంబంధించి ఎన్నో రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిగా ఈ సరస్సులోని అవశేషాలను 1942లో ఒక బ్రిటిష్ రక్షణ అధికారి కనుగొన్నారు. తరువాతి కాలంలో ఈ సరసుకి లేక్ అఫ్ స్కెలెటన్స్ Lake of skeletons మరియు “అస్థిపంజరాల సరస్సు” అని పేరు వచ్చింది. అయితే ఇక్కడ లభించిన అస్థిపంజరాలపై ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఆంత్రపాలజిస్టులకు కానీ, శాస్త్రవేత్తలకు కానీ సరైన సమాధానాలు దొరకడం లేదు.
ఈ ప్రదేశం ఎక్కువగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడి మంచు కరిగినప్పుడు అందులోని అస్థిపంజరాలు బయటపడుతున్నాయి. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే ఈ అస్థిపంజరాలలో కొన్ని వాటికి ఇంకా మాంసం ముద్దలు అతుక్కుని ఉండడం. శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు ఇప్పటి వరకు అక్కడ సుమారు 600 నుంచీ 800 మంది మనుషుల అస్థిపంజరాల అవశేషాలు లభించాయి. లభించిన అస్థిపంజరాలు మీద పరిశోధనలు చెయ్యగా వారికి అసలు వీరందరూ ఎవరు? ఎక్కడ నుంచి వచ్చారు? ఎలా చనిపోయారు? ఇలా ఎన్నో ప్రశ్నలకు ఇప్పటికి సమాధానం లభించడం లేదట.
మొదటిలో ఓ భారతీయ రాజు సైన్యం 870 సంవత్సరాల క్రిందట ఇక్కడ మంచు తుఫానులో చిక్కుకుపోవడం వలన ఇక్కడ నుంచి బయట పడలేక అందరూ మరణించారు అనే కధనం ప్రచారంలో ఉండేది. ఇదిలా ఉండగా మరో కధనం ప్రకారం ఈ అవశేషాలు అన్నీ భారత సైనికులవని అంటుంటారు.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.