Lake of skeletons: 1841వ సంవత్సరంలో భారత్ కి టిబెట్ కి మధ్య యుద్ధం జరిగినపుడు టిబెట్ సైన్యాన్ని భారత్ తిప్పి కొట్టడంతో 70 మందికి పైగా సైనికులు తప్పించుకుంటూ ఉండగా మార్గ మధ్యలో ఇక్కడ వారంతా మరణించి ఉండవచ్చు అని కొందరి వాదన. ఇక మరో కధనం విషయానికి వస్తే… కొందరు ఇదొక స్మశానవాటిక అయ్యి ఉండవచ్చని అప్పటిలో ఏదో అంటువ్యాధి సోకడంతో వీరంతా మరణించారని అభిప్రాయపడుతున్నారు.
శాస్త్రవేత్తలు చెబుతున్న దాని బట్టి చూస్తే…. ఈ అవశేషాలలో ఎక్కువమంది పొడుగు మనుషులే ఉన్నారట.. అంటే, సగటు మనిషి ఎత్తు కన్నా ఎక్కువ ఉన్నారట.అంతేకాకుండా వారిలో ఎక్కువ మంది మధ్య వయస్కులే ఉన్నారట. వీరిలో దాదాపుగా అందరూ మంచి ఆరోగ్యంతో ఉన్నవారేనట. ఇంకొక విషయం ఏమిటంటే వీరంతా ఓకే సమూహానికి చెందిన మనుషులని అంచనా వేస్తున్నారు.
అయితే, తాజా అధ్యయనాల ప్రకారం ఈ కధనాలు మరియు అంచనాలు నిజం కాకపోవచ్చని అని తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు ఈ సరస్సు దగ్గర దొరికిన 38 అస్థిపంజరాల అవశేషాలను జన్యుపరంగా పరిశీలించారు. కార్బన్-డేటింగ్ ప్రకారం ఈ అవశేషాల మీద పరిశోధించగా కొన్ని అవశేషాలు 1,200 సంవత్సరాల నాటివని గుర్తించారు. అంతేకాకుండా వీరంతా ఒకే సమ్మూహానికి చెందినవారు కాదని జన్యుపరంగా విభిన్న సమూహాలకు చెందినవారని, వీరి మరణాలు ఏకకాలంలో కాకుండా వివిధ కాలాల్లో సంభవించినవనీ తెలిపారు. కొన్ని కొన్ని అవశేషాల మధ్య ఉన్న తేడా వెయ్యి సంవత్సరాలు కూడా ఉందని చెప్పుకొచ్చారు.
వీటిని ఆధారం చేసుకుని శాస్త్రవేత్తలు వీరంతా ఏకకాలంలో మరణించిన వారు అనే వాదనను తిరస్కరించింది. ఇవి నిజం కాకపోతే అసలు ఆ సరస్సు దగ్గర ఏం జరుగుతుంది అన్న ప్రశ్న ఇప్పటికి అగమ్యగోచరం గానే మిగిలింది. ఆ అస్థిపంజరాల అవశేషాలలో కొందరి జన్యు లక్షణాలు, ప్రస్తుతం దక్షిణ ఆసియాలో నివసిస్తున్న ప్రజల జీన్స్ తో మ్యాచ్ అయినట్లు పరిశోధకులు చెబుతున్నారు.. ఇదిలా ఉండగా మరి కొందరి జన్యు లక్షణాలు, ప్రస్తుతం యూరోప్లో నివసిస్తున్నవారి జీన్స్ కు మ్యాచ్ అయినట్లు సమాచారం.