Deva katta: దేవా కట్టా – మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రిపబ్లిక్’. ఇందులో హీరోయిన్గా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. ఇపటికే విభిన్నమైన కాన్సెప్ట్ పోస్టర్స్తో సినిమా మీద బాగానే అంచనాలను క్రియేట్ చేశారు. దేవకట్టా – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ అంటే అందరిలో ఆసక్తి బాగా పెరిగింది. అయితే ఇన్నాళ్ళు ఈ సినిమా కథాంశం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే తాజాగా విడుదల చేసిన పోస్టర్తో ఇది పొల్టికల్ బ్యాక్డ్రాప్లో సాగే కథ అని క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ పొలిటికల్ వ్యవస్థపై పోరాటం చేసే ఐఏఎస్ ఆఫీసర్ పంజా అభిరామ్ పాత్రలో నటిస్తున్నాడు.
ఇప్పటి వరకు సాయి ధరమ్ తేజ్ సీరియస్ పాత్రలో నటించలేదు. కానీ మొదటిసారి ‘రిపబ్లిక్’ సినిమాలో అలాగే కనిపించబోతున్నట్లుగా తాజా పోస్టర్తో క్లారిటీ వచ్చింది. సాయి ధరమ్ తేజ్ ని జిల్లా కలెక్టర్ గా చూపిస్తున్నాడు దర్శకుడు దేవా కట్టా. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా రిపబ్లిక్ సినిమాను అక్టోబర్ 1న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన మేకర్స్ ప్రేక్షకుల్లో బాగా బజ్ క్రియేట్ చేశారు. కాగా త్వరలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది.
Deva katta : గత కొంతకాలంగా దేవా కట్టాకి సాలీడ్ హిట్ దక్కడం లేదు.
గత కొంతకాలంగా దేవా కట్టాకి సాలీడ్ హిట్ దక్కడం లేదు. ఎట్టకేలకి ఈ సినిమాతో భారీ హిట్ అందుకొని ఫాంలోకి రావాలని చూస్తున్నాడు. ఇక సాయి ధరమ్ తేజ్ కూడా గతకాలంగా భారీ కమర్షియల్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. గత చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికి ఆశించిన భారీ విజయం మాత్రం దక్కలేదు. అందుకే ‘రిపబ్లిక్’ సినిమాతో ఓ భారీ కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని కసిగా ఉన్నాడు. చూడాలి మరి ఈ ఇద్దరికి ‘రిపబ్లిక్’ సినిమా ఎలాంటి విజయాన్ని ఇస్తుందో.