Devatha Serial: రాధా రామ్మూర్తి , రుక్మిణిమ్మ లతో దేవిని దత్తత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నానని తేల్చి చెబుతుంది.. ఈ విషయంలో ఎవరు ఏమి చెప్పినా తన నిర్ణయం మార్చుకోనని.. ఈ విషయంలో తనని బలవంతం చేయవద్దు అని చెబుతుంది రాధ.. దేవి దత్తత విషయంలో నిన్నటివరకు మాధవ్ బాధపడితే.. నేటి నుంచి వాళ్ళ అమ్మానాన్నలు తనకి తోడయ్యారు..!
ఇంట్లో అందరూ భోజనానికి కూర్చున్నాక దేవి, చిన్మయి ఇద్దరూ తాతయ్య పక్కన కూర్చుంటానని గొడవ చేస్తారు. దేవి కోసం వాళ్ళ నానమ్మ పక్కన కూర్చుంటుంది చిన్మయి. దేవి కి ఇష్టమైన మజ్జిగ చారు చేసిందని సంతోషంతో వాళ్ళ తాతయ్యకు కూడా తినమని వడ్డిస్తుంది. వాళ్ల తాతయ్య ఎంత వద్దంటున్నా వినకుండా దేవి తిను తిను అని వడ్డిస్తోంది దానితో కోపం వచ్చిన రాదా దేవమ్మ అని గట్టిగా అరుస్తుంది. దాంతో కోపం వచ్చిన దేవి నేను అన్నం తినను అని అలిగి బయటకు వెళ్ళిపోతుంది. చెల్లి అన్నం తినకపోతే నేను తినను అని కూడా దేవికి తోడుగా చిన్మయి వెళ్తుంది..
దేవి చిమ్మయితో అక్క ఈ మధ్య అమ్మ మన మీద బాగా అరుస్తుంది. అమ్మ వచ్చి ఎంతగా బ్రతిమలాడినా కూడా మనం తినకుండా ఉండాలి అని అంటుంది. సరే దేవి నువ్వు ఎలా అంటే అలా అని అంటుంది చిన్మయి. ఇక రేపటి ఎపిసోడ్ లో దేవి అఫీసర్ సార్ ఫోన్ చేశాడని అన్నం తినటానికి వస్తుంది. ఈ విషయంపై ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తరువాయి భాగంలో తెలుసుకుందాం.