పరిపాలన విషయంలో గానీ, పథకాల విషయంలో గానీ.. ఏపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి ఏమీ లేకుండా పోయిందని ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. సుమారు 90% హామీలన్నీ తొలి ఏడాదిలోపే అమలు చేసి జగన్ ఆశ్చర్యపరిచారని.. అందుకే ప్రత్యర్థులు తమ సహజసిద్ధమైన లిటిగెంట్ స్వభావంతో.. పిటిషన్లు వేసి, కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. అనంతరం… ఈ విషయాలపై టీడీపీ నేత దేవినేని ఉమ స్పందించారు!
వైసీపీ మేనిఫెస్టోపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా? అని టీడీపీ నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. మాట తప్పి.. మడమ అష్ట వంకర్లు తిప్పారని ఎద్దేవాచేశారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను.. తాము చేశామని వైసీపీ జబ్జలు కొట్టుకుంటోందని చెప్పారు. పోలవరం సమాచారాన్ని ఆన్ లైన్ లో ఎందుకు పెట్టడంలేదని ఉమ నిలదీస్తున్నారు. దమ్ము ధైర్మం ఉంటే సీఎం, మంత్రి ఆ సమాచారం బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇంతవరకూ బాగానే ఉంది కానీ… ఏపీలో సవాళ్లు – ప్రతిసవాళ్లు రోజు రోజుకీ ఎక్కువైపోతున్నాయి. కానీ… ఒక్క సవాల్ పై కూడా చర్చ జరగడం లేదు! సజ్జల చెప్పినదాంట్లో తప్పుందా, ఉమ విమర్శల్లో అర్థముందా అనేది సామాన్యుడికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఈ సవాల్ నేతలకు ఉందనే చెప్పాలి. కాకపోతే… టీడీపీ నేతలు చేస్తున్న సవాళ్లు ఒక్కదానికైనా అధికారపార్టీ స్పందించి సమాధానం చెప్పేస్తే… ఇంక ఆ సమస్య ఉండకపొవచ్చని, అందుకే ఇది సజ్జల కచ్చితంగా స్పందించాల్సిన సమయమని పలువురు అభిప్రాయపడుతున్నారు!
ఎప్పుడు చూసినా… వాళ్ల మైకుల్లో వాళ్లు, వీళ్ల మైకుల్లో వీళ్లు సవాళ్లు చేసుకోవడమే కానీ, నేరుగా ఒక విషయంపై చర్చకు వచ్చి పజలకు క్లారిటీ ఇవ్వాలనే ఆలోచన చేయరు ఎందుకో అనేది మరికొందరి అనుమానం!
కాగా… ఇప్పటికే దేవినేని ఉమ పోలవరంపై చాలా మాటలు చెబుతూ, సవాళ్లు విసిరారు… అయితే ఈ సవాళ్లకు ఏపీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో స్పందించి, ప్రతి సవాల్ చేశారు. కానీ.. ఇప్పటివరకూ వాటిపై ఉమ నోరు మెదపకపోవడం గమనార్హం!