ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి అటు జగన్ ప్రభుత్వం…. ఇటు ఏపీ ప్రభుత్వ అధికారులు విపరీతమైన హీట్ ఎదుర్కొంటున్నారు. ఏదైనా విషయంలో కొంచెం తేడా కనిపిస్తే చాలు హైకోర్టు వారిని తీవ్ర స్థాయిలో మందలించడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. సరైన కారణాలు ఉంటే ఎవరిమీదైనా హైకోర్టు విరుచుకుపడుతోంది.
ఇదే క్రమంలో ఒక పోలీసు అధికారి పదోన్నతి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణానికి రాష్ట్ర డిజిపి, హోం శాఖ మంత్రి తమ ఎదుట హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి ఈ రోజు రాష్ట్ర డిజిపి, హోంశాఖ కార్యదర్శి హై కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే వారిద్దరూ హైకోర్టుకి గైర్హాజరు కావడం కోర్టు వారికి ఆగ్రహం తెప్పించింది. అయినా వారికి మరో అవకాశం ఇస్తూ ఈ నెలలో తప్పనిసరిగా వారు హాజరు కావాలని డీజీపీకి సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది.
ఒక పోలీస్ అధికారి పదోన్నతి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు కోర్టు ధిక్కారణలో కూడా ఈ రోజు వారిద్దరూ హైకోర్టులో హాజరు కావాలి అన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల విధుల్లో ఉన్న కారణంగా తాము హాజరు కాలేమని వారిద్దరూ అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు కోర్టు వారు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందేమో సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చేవరకు ఎన్నికలపై స్టే ఇవ్వాలని అన్ని ప్రక్రియలు వాయిదా వేయాలని సీఎస్ కోరినట్లు హైకోర్టు గుర్తు చేసింది.
కానీ మీరేమో ఎన్నికల్లో విధుల్లో ఉన్నట్లు చూపిస్తున్నారని ఇది ఎలా సాధ్యం అని కోర్టు వారు ప్రశ్నించారు. ఎన్నికలకు వాయిదా కావాలని మీరే అడుగుతారు…. కోర్టు ముందు హాజరు కాండి అంటే ఎన్నికల విధుల్లో ఉన్నామని చెబుతారు…అని అసహనం వ్యక్తం చేసింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 27న కోర్టుకు హాజరు కావాల్సిందేనని డిజిపి హోమ్ సెక్రటరీకి హైకోర్టు స్పష్టం చేసింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?