Dhanush Aishwarya: తమిళనాట స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య జంట విడిపోయారు. ట్విట్టర్ వేదికగా ధనుష్ ఓ లేఖను పోస్టు చేసి విడాకుల ప్రకటనను అధికారికంగా వెల్లడించారు. 18 ఏళ్లుగా కలిసి ఉన్న తమ జంట విడిపోయేందుకు నిర్ణయించుకుందని ఆయన చెప్పడంతో ఇండస్ట్రీ అంతా ఒక్క సారిగా విస్మయానికి గురైంది. ధనుష్ – ఐశ్వర్యల వివాహం 2004లో జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి కుమారుడు యాత్ర 2006లో జన్మించగా, లింగ నాలుగు సంవత్సరాల తరువాత 2010లో జన్మించింది.
Dhanush Aishwarya: వారితో మాట్లాడాలనుకుంటున్న రజనీకాంత్
అయితే కుమార్తె విడాకులపై సూపర్ స్టార్ రజనీకాంత్ బహిరంగంగా స్పందించలేదు. వీరు విడిపోవడానికి పెద్దగా కారణాలు ఏమీ లేదని సమాచారం. అభిమానులు మాత్రం వీరు ఇద్దరు కలిసి శుఖంగా జీవనం కొనసాగించాలని కోరుకుంటున్నారు. రజనీ ఉద్దేశం కూడా అదేలా ఉందట. ధనుష్ – ఐశ్వర్యలను కూర్చోబెట్టి రజనీ కాంత్ మాట్లాడాలని అనుకుంటున్నారుట. తనకు తెలియకుండా వారిద్దరే విడాకులపై నిర్ణయం తీసుకోవడంతో వారిని కలిపేందుకు రజనీకాంత్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇద్దరిని కూర్చోబెట్టి రజనీకాంత్ మాట్లాడితే ధనుష్, ఐశ్వర్యలు మెత్తబడే అవకాశం ఉందనీ, మళ్లీ కలిసే అవకాశం ఉందని అంటున్నారు.
అభిమానుల్లో విస్మయం
సెలబ్రిటీలు ఇలా చిన్న చిన్న కారణాలతో విడాకులు తీసుకోవడం అభిమానులను విస్మయానికి, ఆందోళనకు గురి చేస్తుంటుంది. దాదాపు 18 సంవత్సరాల పాటు అన్యోన్యంగా జీవనం సాగించిన ధనుష్ – ఐశ్వర్యలు విడిపోతున్నారు అంటే తలైవా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రజనీకాంత్ చొరవ తీసుకుని కుమార్తె జీవితాన్ని చక్కదిద్దాలని అభిమానులు కోరుకుంటున్నారు. రజనీకాంత్ కూర్చోబెట్టి వారిద్దరితో మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకుంటున్నారు.