సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను తమిళ స్టార్ హీరో ధనుష్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరు అనూహ్యంగా ఇటీవల విడాకులు తీసుకుని అందరికీ భారీ షాక్ ఇచ్చారు. ఈ కోలీవుడ్ స్టార్ కపుల్ 18 ఏళ్ల సుదీర్ఘ వివాహ బంధానికి వీరు విడాకులతో ముగింపు పలికారు. వీరిద్దరూ విడిపోకుండా ఉండడానికి రజనీకాంత్ చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఆయన ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. ప్రస్తుతం ఐశ్వర్య, ధనుష్ లు విడాకులు తీసుకుని ఎవరికి వారు విడిగా జీవిస్తున్నారు. తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన ఒక సంఘటన చూసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అభిమానులు మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు.
డివోర్స్ తర్వాత తొలిసారిగా కలిశారు
విడాకులు తీసుకున్న తర్వాత ఈ జంట తొలిసారి కలుసుకున్నారు. దాంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధనుష్, ఐశ్వర్యలు తమ పద్దెనిమిదేళ్ల సంసారంలో ఇద్దరు కుమారులకు తల్లిదండ్రులు అయ్యారు. వీరిలో పెద్ద కొడుకు పేరు యాత్ర, రెండో కొడుకు పేరు లింగ. తాజాగా వారి పెద్ద కొడుకు యాత్ర స్పోర్ట్స్ కెప్టెన్ అవడంతో ధనుష్, ఐశ్వర్య కలిసి ఒక స్కూల్ ఫంక్షన్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఉన్న ఆ ఈవెంట్లోని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సినీ విశేషాలు
ధనుష్ చివరిసారిగా హాలీవుడ్ చిత్రం ది గ్రే మ్యాన్లో కనిపించాడు. అతను ఈ సినిమాలో చిన్న పాత్ర చేసినా అది మంచి ప్రభావం చూపింది. ఇప్పుడు ఈ హీరో యాక్షన్ డ్రామా వాతిలో నటిస్తున్నాడు. భారతదేశంలోని విద్యావ్యవస్థ ఎలా ఉంది అనే అంశంపై ఈ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా టీజర్, పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభించింది.