Dhanush: తమిళ్ హీరో ధనష్ తన అద్భుతమైన నటనతో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అసురన్ మూవీతో అతడు నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించి దుమ్మురేపుతున్నాడు. ఇటీవలే అవెంజర్స్ డైరెక్టర్స్ రస్సో బ్రదర్స్ డైరెక్ట్ చేస్తున్న గ్రే మాన్ ఒక హాలీవుడ్ చిత్రంలో కూడా నటించాడు. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ధనుష్ మరో కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. ‘కెప్టెన్ మిల్లర్ (Captain Miller)’ అనే పేరుతో వస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.
Captain Miller: తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్
ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళంలో ఒకేసారి రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ధనుష్ ట్రిపుల్ రోల్స్లో నటిస్తున్నాడు. ఇంతకుముందు డబుల్ యాక్షన్ చేసి ఫ్యాన్స్ తో విజిల్స్ కొట్టించుకున్న ధనుష్ ఇప్పుడు త్రిబుల్ యాక్షన్లో అదరగొట్టడానికి రెడీ అయిపోయాడు. ధనుష్ ఫొటోలతో ఒక చిన్న టీజర్ వీడియో కూడా ఇప్పటికే విడుదల చేశారు. ధనుష్ ముఖానికి కండువా కప్పుకుని బైక్ నడుపుతున్నట్లు ఆ వీడియో కనిపించింది.
పీరియడ్ డ్రామా
1930-40వ కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీ నేపథ్యంలో జరిగిన కథగా ఇది ప్రేక్షకులను అలరించనుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో ధనుష్ నటించనున్న మూడు రోల్స్ ఏంటనేవి ఇంకా తెలియలేదు. ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాకి సెందిల్ త్యాగరాజు అర్జున్ త్యాగరాజు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి జి.వి ప్రకాష్ కుమార్ సంగీత బాణీలు సమకూర్చుతున్నాడు. ఈ మూవీ 2023, సమ్మర్ లో విడుదల కానుంది. ధనుష్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ద్విభాషా చిత్రం ‘వాతి’లో నటిస్తున్నాడు.