Dharmavaram (Anantapur) : ధర్మవరం మున్సిపాలిటీ కౌన్సిలర్లు అందరూ కలిసి బాధితుడికి రూ.51,500లు ఆర్ధిక సహాయాన్ని అందించారు. మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ కార్మికుడుగా పని చేస్తున్న ఎం లింగన్న గత నెలలో విధి నిర్వహణ లో భాగంగా చెత్త బండి నింపుతుండగా, ప్రమాదవశాత్తు చేయి కంప్రషర్ లో పడి ఎడమ చేతికి తీవ్రమైన గాయం అయ్యింది. లింగన్న నిరుపేద కుటుంబానికి చెందిన వాడు కావడంతో కౌన్సిలర్లు అందరూ ఆయన ఆర్ధిక సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో భాగంగా ఇవేళ ధర్మవరం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి బాధితుడు లింగన్నకు రూ.51,500ల ఆర్ధిక సాయాన్ని అందించారు. చైర్ పర్సన్ లింగం నిర్మల చేతుల మీదుగా ఈ ఆర్ధిక సాయాన్ని లింగన్నకు అందజేశారు. తనకు ఆర్ధిక సహాయం అందించినందుకు మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికుడు లింగన్న కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
Tirumala: స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి సాక్షాత్కారం