Dharmavarapu Subramanyam: మన టాలీవుడ్ సినీ పరిశ్రమలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఒక కమెడియన్ గా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఆయన నటనతో, కామెడీ టైమింగ్ తో తెలుగు ఇండస్ట్రీ లో తనకంటూ ఎంతో గొప్ప పేరు దక్కించుకున్నారు. అంతేకాకుండా ఆడియన్స్ మనస్సులో కమెడియన్ గా ఒక సుస్థిర స్థానం ను దక్కించుకున్నరు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు హాస్య దర్శకులు జంధ్యాల దర్శకత్వం వహించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కమెడియన్ గా పరిచయమయ్యారు. ఆయనకి తన మొదటి సినిమానే మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి.
అప్పట్లో ఆయన ‘ఆనందో బ్రహ్మ’ అనే కామెడీ సిరీస్ ను స్వయంగా నటించి చిత్రీకరించారు. ఈ కామెడీ సిరీస్ దూరదర్శన్ ఛానల్ లో ప్రసారమయ్యేది. ఈ కామెడీ సిరీస్ అనుకున్న విజయాన్ని ఇవ్వడంతో ఆడియన్స్ లో ఆయనకీ గొప్ప క్రేజ్ వచ్చింది. ఆ తరువాత కొన్ని సంవత్సరాలపాటు ఆయన ఆంధ్రప్రదేశ్ కల్చరల్ అసోసియేషన్ కి చైర్మన్ గా వ్యవహరించారు. కానీ ఆ తరువాత అయన ఆరోగ్యం క్షీణించడంతో ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యారు.
తనని ఆ పరిస్థితిలో చుసిన తన కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు బాధపడడం ఆయన చూడలేకపోయేవారట. ఇటీవల ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి తనయుడు రవితేజ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ రాను రాను ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం మరింతగా క్షీణిస్తూ ఉండడంతో ఆయన తన సన్నిహితులు ఎవరినీ తనని చూడడానికి ఒప్పుకునేవారు కాదని చెప్పారు. దాని వెనుక ఉన్న కారణం ఏమని అడగగా, ఒకప్పుడు ఎంతో ఆనందంగా చుసిన తన సన్నిహితులు తనని ఈ పరిస్థితిలో చూసి తట్టుకోలేరని ఆ ఆవేదన వారు భరించకూడదనే గొప్ప మనసుతో వారిని దూరంగా ఉంచేవారట. ఇది తెలుసుకున్న ఆయన అభిమానులు ఆయన గొప్ప మనసుకి జోహార్లు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.