వాస్తవంగా చెప్పాలంటే ఈటీవీ ఛానల్ కు ఢీ, జబర్దస్త్ రెండు కళ్ళు లాంటివి. తెలుగులోనే కాకుండా దక్షిణ భారతదేశంలోనే నెంబర్ వన్ రియాలిటీ డాన్స్ షో గా ఢీ గుర్తింపు తెచ్చుకుంటే మరొకటి సౌత్ ఇండియా లోనే టాప్ కామెడీ షో గా దూసుకుపోతోంది. ఢీ అయితే ఏకంగా 11 సీజనలు పూర్తి చేసుకుని ప్రస్తుతం చాంపియన్స్ అందరితో మరొక సీజన్ చేస్తోంది. ఇక ఈ సీజన్ కూడా ఫైనల్స్ కు చేరుకుంది.
అయితే ఈ సమయంలో ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ కు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఒక్కసారిగా జడ్జి లు శేఖర్ మాస్టర్, పూర్ణ, ప్రియమణి ఆందోళన చెందుతున్నారు. ఇక వీరిని ఉద్దేశించి బాబా మాస్టర్ వీడియో సందేశం పంపారు.
ఇంతకీ విషయం ఏమిటంటే… న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా జబర్దస్త్ ఆర్టిస్టులు సెలబ్రేట్ చేసుకునేందుకు వారి స్టేజి సరిపోదని ఢీ స్టేజి ని కబ్జా చేశారు. అయితే అందుకు అందులోని కంటెస్టెంట్స్, యాంకర్, జడ్జ్ లు ఒప్పుకోలేదు. దీంతో ఆ షోలో పాల్గొంటున్న కొంతమంది కంటెస్టెంట్ ల ను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆ కిడ్నాప్ చేసింది జబర్దస్త్ కమెడియన్లు అని వారే చెప్పారు. వెంటనే మాకు ఆలోచించుకోవడానికి కొంచెం సమయం కావాలని శేఖర్ మాస్టర్ వారిని కోరారు. కంట్స్తెంట్స్ కి మాత్రం ఏమి కాకూడదని అన్నారు.
అయితే ఇక జబర్దస్త్ పైచేయి సాధించింది అనుకున్న సమయంలో బాబా మాస్టర్ వారికి ఒక వీడియో మెసేజ్ పంపారు. కంటేస్తెంట్లను జబర్దస్త్ కామెడీలు కిడ్నాప్ చేయడం పై ఫైర్ అయ్యాడు. ఏకంగా పెద్ద కత్తి పట్టుకుని ఎంట్రీ ఇచ్చాడు. అతను ఇచ్చిన వార్నింగ్ కు రోజా కూడా స్పందించింది. ఇక ఈ రెండు షో లలో ఉండే కంటెస్టెంట్స్, జడ్జీలు, ఆర్టిస్టులు కలిసి చేసే సందడి ఎలా ఉంటుందో చూడాలంటే న్యూ ఇయర్ వరకు ఆగాల్సిందే.