ఈటీవీలో వచ్చే ఢీ షో గురించి తెలుసు కదా. ఆ షోలో జడ్జిలుగా పూర్ణ, శేఖర్ మాస్టర్, ప్రియమణి వ్యవహరిస్తుండగా… యాంకర్ గా ప్రదీప్.. తమ టీమ్ లకు లీడర్లుగా హైపర్ ఆది, వర్షిణి ఓవైపు, మరో టీమ్ లో సుధీర్, రష్మీ ఉన్నారు.
ఇక.. ఈ షోలో డ్యాన్స్ లతో టీమ్ లు దుమ్ములేపుతాయి. అది ఓవైపు మాత్రమే. మరోవైపు ఈ షోలో కామెడీకి కూడా కొదవ ఉండదు. ఇది ఒక డ్యాన్స్ షో మాత్రమే కాదు.. ఎంటర్ టైన్ మెంట్ కు ఏమాత్రం తక్కువ కాదు ఇది.
డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ ల మధ్యలో హైపర్ ఆది, సుధీర్, యాంకర్ ప్రదీప్ కలిసి చేసే కామెడీ మామూలుగా ఉండదు. మరోవైపు వర్షిణి, రష్మీ కూడా కామెడీని బాగానే పండిస్తారు.
అయితే.. ఈ సారి మాత్రం జడ్జి పూర్ణ.. కామెడీని పండించారు. ఎవరు ఎటువంటి వాళ్లు.. ఎవరు ఎలా డ్యాన్స్ చేస్తారు.. ఎవరు సెట్ లో ఎలా ఉంటారో కళ్లకు కట్టినట్టు చూపించింది పూర్ణ.
మొదటగా యాంకర్ రష్మీ ఎలా డ్యాన్స్ చేస్తుంది.. ఎలా తింటుంది… అన్న దానిపై ఇమిటేట్ చేసిన పూర్ణ.. హైపర్ ఆది మాత్రం లేడీ డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ ఉంటే మాత్రం కళ్లు పెద్దగా తెరిచి మరీ చూస్తాడన్నట్టుగా ఇమిటేట్ చేసింది పూర్ణ. లేడీ పర్ ఫార్మెన్స్ వస్తే చాలు.. హైపర్ ఆది ఆగడు.. అంటూ పంచులు వేసింది. దీంతో.. హైపర్ ఆదికి నిజంగానే అమ్మయిలంటే అంత పిచ్చా.. అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.