ఇండియన్ క్రికెట్ టీంకి విశేష సేవలు అందించిన కెప్టెన్ ధోని పుట్టిన రోజు ఈ రోజు. 1981 జూలై 7వ తారీఖున జార్ఖండ్ లోని రాంచీలో జన్మించిన ధోని ఈ పుట్టిన రోజు తో 39 వ ఏట అడుగు పెట్టడం జరిగింది. భారత్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి 2007 ఐసీసీ 20 20 వరల్డ్ కప్, 2007-08 cb సిరీస్, 2010 ఆసియా కప్, 2011 వరల్డ్ కప్ 2013 ఐసిసి ఛాంపియన్ ట్రోఫీ ఇలా అన్ని ఫార్మాట్లలో ఇండియా జట్టుకి నాయకత్వం వహించి విజయాన్ని అందించిన ధోని కి ప్రతి ఒక్కరు జన్మదిన శుభాకాంక్షలు అందిస్తున్నారు.
అయితే ధోని బర్త్ డే నాడు భార్య సాక్షి ధోని తన భర్త పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. నీ పుట్టిన రోజు గుర్తు చేసుకుంటూనే ఓ ఏడాది గడిచింది. ఈ సంవత్సర కాలంలో వయసు తప్ప మరే విషయంలో నీలో మార్పు రాలేదు అంటూ ధోని పై ప్రేమను కురిపించిన సాక్షి, నువ్వు డిఫరెంట్ వ్యక్తివి శుభాకాంక్షలకు పొగడ్తలకు లొంగే వాడివి కాదు ఈ విషయంలో నీకు మార్పు రావాలి అంటూ ధోనీ భార్య సాక్షి ధోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలిపింది.