Diabetes: ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేదిస్తున్న సమస్యల్లో డయాబెటీస్ ఒకటి.. దీనిని అశ్రద్ధ వహిస్తే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.. డయాబెటీస్ అనేది రక్తం లో చక్కెర స్థాయిల హెచ్చుతగ్గుల కారణంగా వస్తుంది. అయితే మధుమేహం రావటానికి ఒక వయసు ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఆ వయసు వరకు మనం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఇక జీవితాంతం రాకుండా ఉంటుంది.. మరి ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!
Diabetes: మధుమేహం రాకుండా ఈ వయసు వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి..!!
వయసు తో సంబంధం లేకుండా వచ్చే ఆరోగ్య సమస్యల్లో మధుమేహం కూడా ఒకటి.. అయితే షుగర్ కు రావడానికి వయసు తో సంబంధం ఉందట ఒక వేళ మధుమేహం రావాలంటే 45 వయసు లోపే వస్తుంది.. ఒక వేళ ఈ వయసులో రాకపోతే ఇక 60 తర్వాతే వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయాన్ని కనుగొనేందుకు ఒక సర్వే నిర్వహించారు. ఇందుకోసం ఒక సర్వే నిర్వహించగా అందులో 30 నుంచి 40 సంవత్సారాలు మధ్య ఉన్న వారిలో 500 మందికి డయాబెటీస్ ఉంది. 45 నుంచి 60 సంవత్సారాలు మధ్య ఉన్న వారిలో 100 మందికి షుగర్ ఉంది. అదే 60 సంవత్సారాలు దాటిన వారిలో 400 మందికి మధుమేహం ఉంది.. ఈ సర్వే నిజమేనని చాలా మంది వైద్యులు నిర్ధారించారు.
ప్రపంచంలో డయబెటీస్ ఎక్కువ మంది ఉన్న వారిలో భారత దేశం మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా యువత ఎక్కువ మంది డయాబెటీస్ తో భాదితులవుతున్నరు. వారిలోనే మెల్ల మెల్లగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఇక మధ్య వయసులో బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది. 60 ఏళ్ల వరకు షుగర్ బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య వస్తుంది. అయితే వీరు షుగర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా జాగ్రత్తలు అలాగే ఎక్కువ కాలం పాటిస్తే ముందు ముందు ఈ సమస్య వచ్చే వారి సంఖ్య తగ్గుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం అవసరం అని వారు సూచిస్తున్నారు.