హైదరాబాద్కు చెందిన ప్రముఖ జ్యూవెలరీ వ్యాపారి సుఖేష్ గుప్తాకు ఈడీ భారీ షాక్ ఇచ్చింది. ఎంబీఎస్ జ్యువలరీకి రూ.222 కోట్ల భారీ జరిమానాను ఈడీ విధించింది. హాంకాంగ్కు చెందిన లింక్ కంపెనీతో కలిసి సుఖేష్ గుప్తా పెద్ద ఎత్తున డైమండ్ వ్యాపారం నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా హవాలా ద్వారా డైమండ్ వ్యాపారం నిర్వహించిన సుఖేష్ గుప్తాతో పాటు ఎంబిఎస్ జ్యువెలరీ పైన ఫెమా కేసును ఈడీ నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి గతంలో ఈడీ విచారణ జరిపి చార్జిషీట్లు దాఖలు చేసింది. అయితే ఫెమా కేసులో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినందున సుఖేష్ గుప్తాతో పాటు ఎంబిఎస్ జ్యువలరీ పైన రూ.222 కోట్ల భారీ జరిమానా విధించింది. ఈడీ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడం ఇదే మొదటి సారి.
హాంగ్ కాంగ్కు చెందిన ప్రముఖ కంపెనీ లింకింగ్తో కలిసి ఆయన డైమండ్ వ్యాపారం నిర్వహించారు. ఆ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు కానీ కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు. అదే విధంగా అనుమతి లేకుండా హైదరాబాద్ నుండి పెద్ద ఎత్తున డైమండ్ జ్యూవెలర్స్ ని హాంకాంగ్ కు ఎగుమతి చేశారు. ఈ నేపథ్యంలో హావాలా ద్వారా పెద్ద ఎత్తున నిధుల మార్పిడి జరిగినట్లు అధికారులు గుర్తించారు.
కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా హాంకాంగ్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడంతో పాటు డైమండ్ వ్యాపారం చేయడాన్ని ఈడీ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలోనే ఈడీ పెమా కేసు నమోదు చేసి విచారణ జరిపి అరెస్టు చేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి హవాలా వ్యాపారం చేసినందున సుఖేష్ గుప్తాతో పాటు పాటు ఎంబిఎస్ జ్యువలరీపైన భారీ జరిమానా విదించింది.