తెలుగు ఇండస్ట్రీలో కరోనా మూలంగా ఇప్పటికే చాలా సినిమాలకు బ్రేక్ పడింది. కాగా ఈ కరోనా అందరని భయబ్రాంతులకు గురిచేస్తుంది. అయితే తాజాగా మెగస్టార్ కు కరోనా పాజిటీవ్ అని తేలింది. ఇంకేముంది సినీ ఇండస్ట్రీలో టెన్షన్ మొదలైంది. మెగస్టార్ చిరంజీవికి కరోనా వస్తే అందరికీ ఎందుకు టెన్షన్ అనుకుంటున్నారు కదూ… దానికి కారణం లేకపోలేదండోయ్..తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవికి కరోనా వచ్చిన విషయమే హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఈయనకు కరోనా లక్షణాలు ఒక్కటి కూడా లేవట. కాని సినిమా షూటింగ్ కు వెళ్లినప్పుడు అలా టెస్ట్ చేయించుకున్నారట. దాంట్లో చిరుకు కరోనా పాజిటీవ్ అని తేలిందట. ఇంకేముంది కొందరి గుండెల్లో రాయిపడ్డట్టయింది. అందులో అప్పటి వరకు చిరుతో ఉన్న వాళ్లందరిలో హైరానా మొదలైందట. కాకపోతే చిరుకు ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కాని ఆయనతో ఉన్న వారికి మాత్రం అది తమకు కూడా సోకుతుందేమోనని టెన్షన్ మొదలైంది. దీని మూలంగా చాలా సినిమాలకు బ్రేక్ పడే అవకాశాలున్నట్టు కనిపిస్తోంది. ముందుగా చిరంజీవి ఆచార్య.. ఈ మూవీ షూటింగ్ నవంబర్ 9 నుంచి హైదరాబాద్ లో జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కూడా. అయితే సినిమా గురించి చిరంజీవితో కొరటాల ముచ్చటించారు. దీంతో కొరటాలకు కరోనా భయం చుట్టుకుందనేది స్పష్టం అవుతుంది. దీనితో పాటుగా చిరంజీవితో తన తనయుడు రామ్ చరణ్ తో కలిసి మొక్కలు నాటాడు. దాంతో చిరంజీవి ఇంట్లో కూడా కరోనా ప్రభావం ఉండబోతుందని అర్థమవుతోంది.
కాగా త్రిపులార్ మూవీలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. దాంతో ఆ సినిమాపై కూడా టెన్షన్ ఏర్పడింది. అలాగే నాగార్జున, చిరు కలిసి ఒకే కారులో ప్రగతి భవన్ కు వెళ్లారట. దాంతో బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్న నాగార్జునకు టెన్షన్ చుట్టుకుందట.. మెగస్టార్ చిరంజీవి ఒక్కరికి కరోనా రావడం మూలంగా ఇంతమంది సఫర్ అవుతున్నారు బాబోయ్.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంతమంచిదని నిపుణులు సూచిస్తూనే ఉన్నారు. అయినా కరోనాకు సరైనా నియంత్రణ మార్గాలు పాటించకపోవడం మూలంగా కరోనా వ్యాపిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి అభిమానులు ఆయన తొందరగా కరోనా నుంచి బయటకు రావాలని ఆశిస్తున్నారు.