అందచందాల తోనే కాదు నటనలోనూ తనదైన ట్రెండ్ ను సెట్ చేసింది నయనతార. ఆమె సినిమా రిలీజ్ అయిందంటే చాలు బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే. స్టార్ హీరోల రేంజ్ కి ఏ మాత్రం తగ్గని క్రేజ్ ఆమె సొంతం చేసుకుంది. రీసెంట్ గా నయనతార కథానాయక గా నటించిన కొలమావు కోకిల .. తెలుగులో కోకో కోకిల రిలీజ్ అయి హిట్ సాధించింది. అయితే ఇప్పుడు ఇదే సినిమా బాలీవుడ్ రీమేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు దర్శక, నిర్మాతలు.
కాగా ఈ సినిమాలో కథానాయిక జాన్వీ కపూర్ ను ఎన్నుకున్నారని లేటెస్ట్ న్యూస్. కోకిల చిత్రం ద్వారా నయనతార భారీ హిట్ దక్కించుకుంది. తన నటనతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. సౌత్ ఆడియన్స్ కి ఈ మూవీ బాగా కనెక్ట్ అవ్వడం తో హిందీలో రీమేక్ చేయాలని దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ రెడీ అవుతున్నాడట. అందాల తార శ్రీదేవీ నట వారసురాలిగా జాన్వీ కపూర్ ధడకన్ సినిమాతో వెండితెరకు పరిచయమై తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటోంది. నటనతో తానేమిటో నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు నటన పరంగా జాన్వీ కి బాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి క్రేజే నెలకొంది.
కాగా ప్రస్తుతం బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమా దోస్తానా సీక్వెల్ దోస్తానా 2 లో నటిస్తోంది జాన్వికపూర్. అలాగే మరో చిత్రం రూహీ ఆఫ్ జా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తమిళంలో.. తెలుగులో విజయం సాధించిన కోకిల సినిమాలో నటించనుంది. ఈ సినిమా షూటింగ్ జనవరి 9 నుంచి పంజాబ్ లో మొదలు పెట్టడానికి సిద్దమవుతున్నారు. సింగిల్ షెడ్యూల్ లో నే ఈ సినిమాని కంప్లీట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే జాన్వీ కపూర్ సాలీడ్ హిట్ కోసమే నయనతార నటించిన ఈ సినిమా ని ఎంచుకుందని బాలీవుడ్ మీడియా వర్గాల్లో చెప్పుకుంటున్నారట.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!