నితిన్ భీష్మ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైనప్ చేసుకుంటున్నాడు. nithin బీష్మ తో అందుకున్న సక్సస్ ని ఇక బ్రేక్ చేయాలనుకోవడం లేదు. ఆమధ్య వరసగా nithin నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతుండటం తో బీష్మ తర్వాత నుంచి తాను నటించబోయే ప్రతీ కథ ని ఎంతో జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. కాగా ప్రస్తుతం nithin చేతిలో 4 సినిమాలున్నాయి. రంగ్ దే అన్న రొమాంటిక్ లవ్ స్టోరీ ఇప్పటికే కంప్లీట్ అయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. చెక్, పవర్ పేట, హిందీ సినిమా అంధాదున్ రీమేక్ సినిమాలు లైన్ లో ఉన్నాయి.
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్న rang de సినిమాకి యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇన్నాళ్ళు అందరు nithin – కీర్తి సురేష్ జంటగా నటించిన rang de సినిమా సంక్రాంతి కి తీసుకు వస్తారని భావించారు. కాని ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కావడం లేదు. రీసెంట్ గా ఈ విషయాన్ని వెల్లడిస్తూ మార్చ్ 26 న రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇంకా కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండటంతో సంక్రాంతి బరి నుంచి షిఫ్ట్ అయి మార్చ్ చివరి వారంలో రీలిజ్ చేస్తున్నారు.
అయితే ఇప్పటికే nithin సినిమా వచ్చి దాదాపు సంవత్సరం కావస్తుందని ఈ గ్యాప్ మరీ ఎక్కువైందన్న కారణంగా rang de తర్వాత రిలీజ్ అనుకున్న nithin మరో సినిమా చెక్ ని ముందు రిలీజ్ చేయబోతున్నారట. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ నటించిన చెక్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా టిజర్ రిలీజై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. కాగా nithin సినిమాని మార్చ్ చివరి వారంలో రిలీజ్ చేయబోతుండగా చెక్ సినిమా ఈ నెల 26 న లేదంటే ఫిబ్రవరి రెండవ వారంలో రిలీజ్ చేసే అవకాశాలున్నాయని సమాచారం.