Kiara advani : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లలో హీరోయిన్స్ మధ్య వీర లెవ్ల్లో పోటీ ఉంటుంది. స్టార్ డం వచ్చాక ప్రాజెక్ట్ విషయంలో ఒకరికి ఒకరితో మంచి పోటీ ఉంటుంది. ఆ పోటీ ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో గట్టిగా ఇచ్చింది. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ పోటీ పూజా హెగ్డే – రష్మిక మందన్న – కీర్తి సురేష్ – సాయి పల్లవిల మధ్య భారీగా ఉంది. వీరందరూ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్గా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. వీరిలో పూజా హెగ్డే – రష్మిక మందన్న బాలీవుడ్కి వెళ్ళారు. అక్కడ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.
కియారా అద్వానీ గత మూడేళ్ళుగా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. వరుసగా అక్కడ భారీ ప్రాజెక్ట్స్ కమిటవుతోంది. తెలుగులో స్టార్ హీరో, పెద్ద నిర్మాణ సంస్థలో సినిమా అవకాశం వచ్చినా డేట్స్ ఇవ్వలేనంతగా బాలీవుడ్ లో బిజీగా ఉంది. ఇప్పుడు ఆమెకి పోటీ ఇవ్వడానికి పూజా హెగ్డే, రష్మిక మందన్న రెడీ అయ్యారు. పూజా రెండు సినిమాలు చేస్తోంది. రష్మిక మందన్న మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. త్వరలో బాలీవుడ్ కి సాయి పల్లవి కూడా వెళ్ళబోతోందని ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ – టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఒక త్రిభాషా చిత్రం ప్రకటించారు.
Kiara advani : హీరోయిన్గా కియారా అద్వానీ ని తీసుకోవాలని అనుకున్నారట.
దీనిలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుందని సమాచారం. అయితే వీరికంటే ముందు నుంచి బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ క్రేజ్ తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో ఈమెకి పెద్దగా అవకాశాలు లేనప్పటికి హిందీ సినిమాలు మాత్రం బాగానే ఉన్నాయి. అయితే అక్షయ్ కుమార్ త్వరలో మరో కొత్త సినిమా చేయనున్నాడట. ఇందులో హీరోయిన్గా కియారా అద్వానీ ని తీసుకోవాలని అనుకున్నారట. అయితే ఇప్పుడు కియారా అద్వానీ కాకుండా రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని బాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రకుల్ చేతిలో మూడు బాలీవుడ్ సినిమాలున్నాయని తెలుస్తోంది. ఇప్పుడు మరో సినిమా తన అకౌంట్ లో చేరబోతోంది.