తాజాగా అక్కినేని అఖిల్ నటించబోతున్న అఖిల్ 5 ప్రాజెక్ట్ ని అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అఖిల్.. 4 వ సినిమాగా చేస్తున్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సెట్స్ మీదుండగానే ఈ తాజా చిత్రాన్ని ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఏ.కే. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రంహం సుంకర సమర్పిస్తుండగా అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు.
గత కొన్ని నెలలుగా సురేందర్ రెడ్డి సినిమా హీరో ఎవరంటూ రక రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కాగా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తో మూవీ చేయబోతున్నట్లుగా సురేందర్ రెడ్డి నుండి అధికారకమైన ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళేందుకు కొంత సమయం ఉండటంతో ఈ గ్యాప్ లో అఖిల్ తో ఒక సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. సైరా తర్వాత రామ్ చరణ్ తో సూరి ఒక సినిమా చేస్తున్నట్టు అంతక ముందు వార్తలు వచ్చాయి. ఇద్దరి మద్య కథా చర్చలు కూడా జరిగాయని చెప్పుకున్నారు.
అయితే చరణ్ ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న కారణంగా సూరి తో సినిమా చేసేందుకు బాగా సమయం పడుతుండటంతో ఈ ప్రాజెక్ట్ పెండింగ్ లో పడింది. కాగా చరణ్ చేయలేక పోతున్న ఆ ప్రాజెక్ట్ ను అఖిల్ తో చేసేందుకు సురేందర్ రెడ్డి రెడీ అయ్యాడని తాజా సమాచారం. అఖిల్ కు ఈ కథ బాగా సూట్ అవుతుందని.. సినిమా చేస్తే అఖిల్ కి పక్కా భారీ హిట్ దక్కుతుందని చరణ్ ఈ ప్రాజెక్ట్ విషయంలో సూరికి సలహా ఇచ్చాడట.
చరణ్ కి అఖిల్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఇద్దరి మద్య అన్నదమ్ముల బంధం కనిపిస్తుంది. ఈ కారణంగానే తనకి బాగా నచ్చిన కథ అఖిల్ కి ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి అఖిల్ 5 కి చరణ్ కథ సెట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. ఇలాంటి వాతావరణం ఉంటే ఫ్యాన్స్ అందరు ఏకమై హంగామా చేయడం చూస్తే రెండు కళ్ళు చాలవు అని చెప్పుకుంటున్నారు.